మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న పలువురిని కాంగ్రెస్ నాయకులను పార్టీ నుండి సస్పండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ తెలిపారు.
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమలకు పాల్పడుతున్న నాగిరెడ్డి,మాజీ సర్పంచ్,బస్వరాజ్ దేశాయ్,
అంజనీ నాందేవ్ పటేల్ కు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రావు ఆదేశాల మేరకు పార్టీ నుండి సస్పెండ్ చేస్తునట్లు తెలిపారు.
పార్టీ కోసం పని చేసే నాయకులు, కార్యకర్తలకు పార్టీ లో సముచిత స్థానం కల్పించనున్నట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతేరేక పనులు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చిప్ప మోహన్,అక్కల్ సాయిరెడ్డి,మనిక్ రెడ్డి,సంజీక్ కల్లూరి పందిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.









