నియోజకవర్గ తెలుగుదేశం నేతల్లో జోష్..!ఎమ్మెల్యే కాకర్ల ఆధ్వర్యంలో టిడిపి బూత్ కన్వీనర్ల, కో-కన్వీనర్ల ప్రమాణ స్వీకారం…!!

పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా- ఎమ్మెల్యే కాకర్ల ..!

వింజమూరు, నవంబర్ 12 మనధ్యాసన్యూస్:///

తెలుగుదేశం పార్టీ అధినేత,ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సూచనలతో ఉదయగిరి నియోజకవర్గంలో టిడిపి బూత్ కన్వీనర్లు, కో-కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం వింజమూరు ప్రధాన టిడిపి కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమమునకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధ్యక్షత వహించగా, నియోజకవర్గంలోని 8 మండలాల ప్రధాన నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, మహిళా నాయకులు మరియు వేలాదిమంది కార్యకర్తలు భారీగా హాజరై ఈ వేడుకను విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదనీ, ఇది లక్షలాది మంది కార్యకర్తల ఆశయాలు, ఆత్మీయతలు మిళితమైన పార్టీ అని, పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి నాయకుడికి తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు.కార్యకర్తలే పార్టీకి అండదండని, వారే పార్టీకి నిజమైన సైనికులనీ, వారు ప్రజల్లో పార్టీ పతాకాన్ని ఎగురవేస్తున్నారనీ. పదవులు పొందిన నాయకులు ఆ పదవులను అలంకారప్రాయంగా కాకుండా ప్రజాసేవా సాధనంగా చూడాలని ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.“నియోజకవర్గంలో ప్రతి గ్రామం వరకు తెలుగుదేశం పతాకం ఎగురవేయడం, ప్రజలకు పార్టీ తీరుతెన్నులు చేరవేయడం మనందరి బాధ్యత. మన సమష్టి కృషితో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుంది” అని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం