ఎమ్మెల్యే కాకర్ల ఆధ్వర్యంలో అట్టహాసంగా టిడిపి రథసారదుల ప్రమాణ స్వీకారం..పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీ పదవుల ద్వారా గుర్తింపు.. ఎమ్మెల్యే కాకర్ల ..

ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..నియోజకవర్గ తెలుగుదేశం నేతల్లో జోష్..

వింజమూరు నవంబర్ 11 మన ధ్యాస న్యూస్ ://

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు సూచనల మేరకు పండుగ వాతావరణం లో తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో మంగళవారం మండలం, క్లస్టర్, యూనిట్ కమిటీలు అధ్యక్ష కార్యదర్శులు నియామక ప్రమాణ స్వీకార మహోత్సవము ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంభం విజయరామిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి చంచల బాబు యాదవ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎల్ సి రమణారెడ్డిలు హాజరయ్యారు. అదేవిధంగా నియోజకవర్గంలోనే 8 మండలాల ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు నాయకులకు పార్టీలో సమచిత స్థానం కల్పించడంలో తెలుగుదేశం ముందుంటుందని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి బలమని వారే నిజమైన సైనికులని తెలిపారు. పదవులు పొందిన ప్రతి ఒక్కరు పదవిని అలంకారప్రాయంగా చూడకుండా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. నేటి నుండి మూడు రోజులపాటు మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూతు కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు పార్టీ సూచించిన నేతలను అఖండ విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీ రథసారదులుగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలన్నారు. పార్టీ పదవులను పందారం చేయడంతో నాయకుల్లో జోష్ పెరిగింది.

వింజమూరు మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, దుత్తలూరుమండల కన్వీనర్ గా ఉండేల గురువారెడ్డి, వరికుంటపాడు మండల కన్వీనర్ గా చండ్ర మధుసూదన్ రావు, సీతారాంపురం కన్వీనర్ గా చింతల శ్రీనివాసులు, కొండాపురం కన్వీనర్ గా పోలినేని చంద్రబాబు నాయుడు, జలదంకి మండల కన్వీనర్ గా మునగాల తిరుమలరెడ్డి ,అలాగే మండల క్లస్టర్ ఇంచార్జీలుగా సీతారాంపురం తోకల రామచంద్ర, ఉదయగిరి షేక్ రియాజ్, దుత్తలూరు, తాళ్లూరి దయానందం, వరికుంటపాడు, పోక మహేష్ , వింజమూరు చేబ్రోలు వసంతరావు, కొండాపురం పోలినేని రమేష్ , కలిగిరి కల్లూరి చంద్రమౌళి, గంజo రాఘవేంద్ర, జలదంకి మందపల్లిమాల్యాద్రి, పూనూరు భాస్కర్ రెడ్డి, కో క్లస్టర్ ఇన్చార్జీలుగా పేరం సుధాకర్ రెడ్డి, మారెళ్ళ మల్లికార్జున, పాములపాటి మాల్యాద్రి, అంబటి శంకరయ్య, నోటి మల్లికార్జున, దివి శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శిలుగా, ముత్తూరు సుమన్ బాబు, పోలుబోయిన శ్రీకాంత్ యాదవ్, బద్దిపూడి మాచర్ల, జాజుల శివరామయ్య, చల్లా శ్రీనివాసులు యాదవ్, కందుకూరి వెంకటేశ్వర్లు, వీరితోపాటు మండల పార్టీ ఆర్గనైసింగ్ సెక్రెటరీలు, సెక్రటరీలు, కోశాధికారులు, మరియు యూనిట్ ఇన్చార్జిలుగా మరో 95 మంది చేత ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో 8 మండలాల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం