

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) హైదరాబాద్ లో ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను బుధవారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ పరామర్శించారు..అనంతరం.ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
త్వరగా కోలుకొని ప్రజల మధ్యకు రావాలని ఎంపీ కోరుకున్నారు.