నిరంతరం ప్రజా సేవలో ఉన్నాను…… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి

మన న్యూస్, కావలి:*విధ్వంసం నుండి అభివృద్ధి వైపుకు పయనిస్తున్నాము.కూటమి ప్రభుత్వం లో సంవత్సర కాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించాము .*జూన్ 3న సంవత్సర కాల పురోగతి పై ప్రజెంటేషన్.*కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి.కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రజల కష్టాలను తొలగించడానికి నిరంతరం ప్రజా సేవలోనే ఉన్నానని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ…… కావలి ఎమ్మెల్యే గా భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించి జూన్ 4వ తేదీకి ఏడాది పూర్తవుతుందని తెలిపారు. గతంలోని విధ్వంసాల నుండి అభివృద్ధి వైపుకు పయనిస్తున్నామని, ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం లో సంవత్సర కాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించామని తెలిపారు. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల పై, అలాగే గత ఐదు సంవత్సరాల కాలంలో కావలి మున్సిపాలిటీకి జరిగినటువంటి విద్వంసం మీద జూన్ 3వ తేదీ మంగళవారం ఉదయం 10.30 గంటలకు దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం నందు ప్రెసెంటేషన్ ఇస్తున్నామని తెలిపారు.పుర ప్రముఖులు,వివిధ పార్టీల నాయకులు, స్వచ్చంద సంస్థలు, ప్రజా సంఘాలు, మీడియా వారిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వాస్తవాలను ప్రజలందరికీ తెలియజేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధి అంటే జవాబుదారితనం అని, మీరు వేసిన ఓటుకి ఫలితంగా ఈ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేయాలని, అందుకే గతంలో ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతుంది? అనేది ప్రజల ముంగిట పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ నియోజకవర్గం మనదని,ఈ నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కాబట్టి, అందరూ తప్పక హాజరు కావాలని కోరారు. సుహృద్భావ వాతావరణంలో మనందరం మన భవిష్యత్తుకు ప్రణాళికలు నిర్ణయించుకుందామని అన్నారు.

  • Related Posts

    నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ

    మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…

    యోగా తో ఆరోగ్యం,ఆనందం.

    మన న్యూస్ సాలూరు జూన్7:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మే 21నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి