
మన న్యూస్, కావలి:*విధ్వంసం నుండి అభివృద్ధి వైపుకు పయనిస్తున్నాము.కూటమి ప్రభుత్వం లో సంవత్సర కాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించాము .*జూన్ 3న సంవత్సర కాల పురోగతి పై ప్రజెంటేషన్.*కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి.కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రజల కష్టాలను తొలగించడానికి నిరంతరం ప్రజా సేవలోనే ఉన్నానని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ…… కావలి ఎమ్మెల్యే గా భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించి జూన్ 4వ తేదీకి ఏడాది పూర్తవుతుందని తెలిపారు. గతంలోని విధ్వంసాల నుండి అభివృద్ధి వైపుకు పయనిస్తున్నామని, ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం లో సంవత్సర కాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించామని తెలిపారు. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల పై, అలాగే గత ఐదు సంవత్సరాల కాలంలో కావలి మున్సిపాలిటీకి జరిగినటువంటి విద్వంసం మీద జూన్ 3వ తేదీ మంగళవారం ఉదయం 10.30 గంటలకు దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం నందు ప్రెసెంటేషన్ ఇస్తున్నామని తెలిపారు.పుర ప్రముఖులు,వివిధ పార్టీల నాయకులు, స్వచ్చంద సంస్థలు, ప్రజా సంఘాలు, మీడియా వారిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వాస్తవాలను ప్రజలందరికీ తెలియజేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధి అంటే జవాబుదారితనం అని, మీరు వేసిన ఓటుకి ఫలితంగా ఈ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేయాలని, అందుకే గతంలో ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతుంది? అనేది ప్రజల ముంగిట పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ నియోజకవర్గం మనదని,ఈ నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కాబట్టి, అందరూ తప్పక హాజరు కావాలని కోరారు. సుహృద్భావ వాతావరణంలో మనందరం మన భవిష్యత్తుకు ప్రణాళికలు నిర్ణయించుకుందామని అన్నారు.
