మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 25 :నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నాయకత్వం లో గ్రౌండ్ లెవల్లో క్రింది స్థాయిలో ఉండే కార్యకర్తలు నుండి ప్రతి ఒక్క నాయకుడిని కూడా సమన్వయ పరచి ప్రతి ఒక్కరినీ కలుపుకునిపోతూ ఎంతో ఉత్సాహంగా పార్టీ ని చాలా పటిష్టం గా బలోపేతం చేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో వై.సి.పి పార్టీని బలోపేతం దిశగా ఎంతో ముందుకు తీసుకెళ్తూ డివిజన్ కమిటీ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న ఆనం విజయకుమార్ రెడ్డి. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గం, చింతరెడ్డిపాళెంలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నివాసం నందు 30వ డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆనం విజయకుమార్ రెడ్డి.ఈ సందర్భంగా ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ…….నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మన పార్టీ కోసం పని చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎంత చిన్న స్థాయి కార్యకర్త అయినా ఎంత చిన్న నాయకుడు అయినా సరే పార్టీ కోసం నిజంగా నిజాయితీగా కష్టపడి పని చేస్తే వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి మరియు ప్రతి కార్యకర్తకి పార్టీ పదవి వచ్చేలా చూస్తానని,అధికారం కోసమో డబ్బు కోసం,బెదిరింపులకు భయపడే వారో లేక డబుల్ గేమ్ డ్రామాలు ఆడే వారు నాకు మన పార్టీ కి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం,పార్టీ పట్ల క్రమశిక్షణతో ఉండే వాళ్ళు అంటే నేను ఎక్కువగా ప్రేమిస్తాను పార్టీ అంటే అభిమానం ఉండే ప్రతి ఒక్కరికి నేను మీ కుటుంబ సొంత మనిషి గా మీకు నేను అండగా ఉంటానని తెలియజేశారు ఇంత వర్షం లో కూడా తడుస్తూ 30వ డివిజన్ నుండి ఇంతమంది నాయకులు కార్యకర్తలు వచ్చినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతతో ధన్యవాదములు తెలియజేసారు.ఈ సమావేశంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 30వ డివిజన్ ఇంచార్జ్ గా వీరప్ప రెడ్డి నారాయణరెడ్డిని నియమించడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని చాలా పటిష్టమైన పార్టీ గా ప్రతి ఒక్క నాయకుడు మరియు ప్రతి కార్యకర్త 30వ డివిజన్ లో పార్టీ బోలోపేతంకి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ లేబుర్ పరమేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాస్ రావు (RSR), నెల్లూరు రూరల్ నియోజకవర్గ,ఎంప్లాయస్ &పెన్షనర్స్‌ విభాగ అధ్యక్షుడు కనకట్ల మోహన్ రావు ముదిరాజ్, రైతు విభాగ అధ్యక్షుడు ఆళ్ల మనోహర్ రెడ్డి,ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నవీన్ కుమార్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు వంశీకృష్ణ, మాజీ ఎంపీటీసీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, 24వ డివిజన్ నాయకులు ఉడుత మురళి యాదవ్,36వ డివిజన్ నాయకులు నరసింహారెడ్డి, 30వ డివిజన్ నాయకులు హరి రెడ్డి, వెంకట్ రెడ్డి, నారాయణరెడ్డి, రామిరెడ్డి, శ్రీకాంత్ మహిళా నాయకురాలు పి.వసంతమ్మ ఉమా మహేశ్వరి,భారతి,దుర్గ,బుజ్జమ్మ, కృపమ్మ మరియు 30వ డివిజన్ కమిటీ నాయకులు,పార్టీ అనుబంధ విభాగ అధ్యక్షులు నాయకులు,డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *