ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి…

మనన్యూస్:బార్బర్ షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ మంజూరు చేయాలి…
నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి…బీసీ సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం…
తిరుపతి, రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల కులదైవమైన ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ను రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం కలసి విన్నవించారు. మంగళవారం అమరావతిలో మంత్రి సవితను రుద్రకోటి సదాశివం కలసి నాయి బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమం కోసం నిధులను కేటాయించాలని అభ్యర్థించారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి పరిష్కరించే దిశగా చొరవ చూపుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం మీడియాతో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నాయి బ్రాహ్మణులు నిర్వహించుకుంటున్న బార్బర్ షాప్ లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ జీవోను వెంటనే అమలు చేయాలని, ఆ దిశగా వెంటనే చొరవ చూపాలన్నారు. అలాగే అన్ని జిల్లాల్లో నాయి బ్రాహ్మణులు ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కావలసిన నిధులు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. నాయి బ్రాహ్మణుల కులదైవమైన ధన్వంతరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, గతంలో ప్రభుత్వం జారీచేసిన 13 14 జీవోల ప్రకారం గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ గదులను నాయి బ్రాహ్మణులకు కేటాయించాలన్నారు. జీవో నెంబర్ 26 ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రులలో బార్బర్ పోస్టులను పోలీస్ శాఖలో బ్యాండ్ పార్టీ విభాగంలో అర్హులైన నాయి బ్రాహ్మణులకే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 50 సంవత్సరాలు పైబడిన నాయి బ్రాహ్మణులకు నెలకు 5000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వాలని ఇల్లులేని నిరుపేద నాయి బ్రాహ్మణులకు ఇంటి స్థలం కేటాయించాలని మంత్రిని కోరామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హామీ ఇచ్చినట్లు రుద్రకోటి సదాశివం మీడియాకు వెల్లడించారు. అంతకుముందు మంత్రి సవితను శాలువతో ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.

  • Related Posts

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి