గద్వాల జిల్లా(మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 15 జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలకేంద్రంలోని ఆదిశిలక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ హుండీ ఆదాయము రూ.18,41,990 లు లభించినట్లు దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. దేవాలయంలో జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. గత ఏడాది రూ.18, 69, 471లు వచ్చినట్లు తెలిపారు. అలాగే చింతలముని దేవాలయం హుండీ లెక్కింపు రూ.14,760 కాగా గత ఏడాది రూ.15,696 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ సేవా సంఘం గద్వాల బ్రమరాంబికా సేవా సంఘం గట్టు సభ్యులు పాల్గొని హుండీ లెక్కించారు. ఈ కార్యక్రమంలో పట్వారి అరవిందరావు, చంద్రశేఖర రావు, బాబురావు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

భారతదేశ విముక్తి కోసం మేడే ఒక స్ఫూర్తి మే డే అంటే(అంతర్జాతీయ కార్మిక దినోత్సవం)రేణిగుంట మే 1రేణిగుంటలో వాడవాడల మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి గారు మాట్లాడుతూప్రతి సంవత్సరం మే 1న కార్మికుల హక్కులు, త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునే రోజు. 1886 మే 1న అమెరికాలోని షికాగోలో ‘8 గంటల పని దినం’ కోసం జరిగిన చారిత్రాత్మక సమ్మె, హేమార్కెట్ దురదృష్టకర సంఘటనల ఫలితంగా ఈ రోజు ఆవిర్భవించింది. కార్మిక సంఘాల పోరాటాల స్ఫూర్తితో, 1889లో మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు.19వ శతాబ్దంలో కార్మికులు రోజుకు 12-16 గంటలు పని చేయాల్సి వచ్చేది. దీనికి వ్యతిరేకంగా అమెరికా ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్స్ అండ్ లేబర్ యూనియన్స్ 1884లో 1886 మే 1 నాటికి 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది.హేమార్కెట్ సంఘటన (1886): 1886 మే 1న లక్షలాది మంది అమెరికా కార్మికులు సమ్మె చేశారు. మే 4న షికాగోలోని హేమార్కెట్ స్క్వేర్‌లో జరిగిన ప్రదర్శనలో బాంబు పేలుడు, పోలీసుల కాల్పుల వల్ల కొందరు కార్మికులు, పోలీసులు మరణించారు.అంతర్జాతీయ గుర్తింపు: ఈ ఘటనలో మరణించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ, 1889లో పారిస్‌లో జరిగిన సెకండ్ ఇంటర్నేషనల్ సమావేశంలో ప్రతి ఏటా మే 1న కార్మిక దినోత్సవం జరపాలని నిర్ణయించారు.భారతదేశంలో మొదటిసారిగా 1923, మే 1న మద్రాసులో హిందుస్థాన్ లేబర్ కిసాన్ పార్టీ నేతృత్వంలో మేడే వేడుకలు జరిగాయి.