గద్వాల జిల్లా(మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 15 జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలకేంద్రంలోని ఆదిశిలక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ హుండీ ఆదాయము రూ.18,41,990 లు లభించినట్లు దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. దేవాలయంలో జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. గత ఏడాది రూ.18, 69, 471లు వచ్చినట్లు తెలిపారు. అలాగే చింతలముని దేవాలయం హుండీ లెక్కింపు రూ.14,760 కాగా గత ఏడాది రూ.15,696 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ సేవా సంఘం గద్వాల బ్రమరాంబికా సేవా సంఘం గట్టు సభ్యులు పాల్గొని హుండీ లెక్కించారు. ఈ కార్యక్రమంలో పట్వారి అరవిందరావు, చంద్రశేఖర రావు, బాబురావు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.