

మన న్యూస్,నెల్లూరు రూరల్,ఏప్రిల్ 10 :నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 19 మందికి మంజూరైన రూ.23 లక్షల చెక్కులను బాధితులకు గురువారం అందజేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో వైద్యం పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం అనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉదారంగా సాయం మంజూరు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి నా ప్రత్యేక ధన్యవాదాలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు.
