ప్రశాంతమ్మ చొరవతోనే షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యకు పరిష్కారం దొరికింది

మనన్యూస్,కోవూరు:ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అసెంబ్లీలో ప్రస్తావించిన కారణంగానే షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించింది.28 కోట్ల బకాయిలు చెల్లించేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు.13 ఏళ్లుగా తాము చేస్తున్న పోరాటం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కృషితో ఫలించిందన్నారు కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని ఆమె నివాసంలో షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘ నాయకులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి పుష్ప గుచ్ఛం యిచ్చి కృతజ్ఞతలు తెలియచేసారు.ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కార్మికులకు చెల్లించాల్సిన 28 కోట్ల బకాయిలను చెల్లించేలా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. తమ పట్ల మానవతా దృక్పధంతో వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కార్మికుల కుటుంబాల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. 13 ఏళ్లుగా దుర్భరమైన తమ జీవితాల్లో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంతమ్మ వెలుగులు నింపారన్నారు. తమ గొంతుకై నిలిచి 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపునకు మార్గం సుగమం చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి కార్మిక కుటుంబాలు రుణపడి ఉంటాయన్నారు. ఇప్పటి దాకా తాము మాటలు చెప్పి మభ్య పెట్టే నాయకులను చూశామని చెప్పిన మాటకు కట్టుబడ్డ నాయకురాలిని తొలిసారిగా చూస్తున్నామన్నారు. గత సంవత్సరం ఏప్రిల్‌ నెలలో బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ.. ఇదే విషయంపై తమ వైఖరిని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలయ్యాక కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ బకాయిలపై ప్రశాంతమ్మ దృష్టి సారించారు.కోవూరును ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చేస్తాం.అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ సాకారం అవుతుండటంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రియల్టర్లకు కట్టబెట్టాలని చూసిన షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 124 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించి ఇండస్ట్రీయల్ హబ్ గా మారుస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ రైతులకు ఆమోద్యయోగ్యమైన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘ నేతలు నారాయణ, ఎంవి రమణ, శివ,మస్తాన్ పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టిడిపి నాయకులు తిరువూరు అశోక్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 8 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//