అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు

మనన్యూస్,పిఠాపురం:మండలం ఎఫ్.కె పాలెం-విరవాడ గ్రామాల మధ్యలో ఉన్న సుమారు 100 ఎకరాల పాపిడి దొడ్డు చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతుండడంపై ఎఫ్.కె. పాలెం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తవ్వకాలను నిలుపుదల చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ శన్మోహన్ సగిలి కు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.అనంతరం పెద్దాపురంలో ఉన్న నీటిపారుదల శాఖ ఈఈ శేషగిరిరావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతులు ముమ్మిడి వెంకన్న బాబు, మలిరెడ్డి పల్లపు రాజా, ముమ్మిడి వీరబాబు, రామిరెడ్డి శ్రీను, ముమ్మిడి తాతికొండ తదితరులు మాట్లాడుతూ పాపిడి దొడ్డి చెరువులో ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు ఇటుక బట్టీల యజమానులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టడం శోచనీయమన్నారు. ఈ సందర్భంగా మట్టి అక్రమంగా తవ్వి తరలించడానికి తీసుకొచ్చిన జెసిబి, లారీలను ఆదివారం అడ్డుకున్నామన్నారు.అనేకమంది రైతాంగానికి పుష్కలంగా సాగునీరు అందిస్తున్న ఈ చెరువులో మట్టి తవ్వకాలు చేపడితే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సాగునీరు సక్రమంగా అందని పరిస్థితుల్లో నీటి ఎద్దడి ఏర్పడి రైతాంగానికి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు ఈ చెరువులో తవ్వకాలు జరిపారని, ఇప్పుడు మరోసారి అక్రమ తవ్వకాలు చేపడితే పెద్దపెద్ద గోతులు ఏర్పడి ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. గతంలో తవ్వకాలు జరపగా అనేక పశువులు మృత్యువాత పడ్డాయి అన్నారు. మనుషులు కూడా ప్రమాదాలకు గురైన సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అనుమతులు లేకుండా వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి అక్రమ తవ్వకాలు ఏమిటని ఈ సందర్భంగా రైతులు ప్రశ్నించారు.ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళతామని తెలిపారు. అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హైకోర్టులో కేసు వేస్తామని తెలిపారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///