

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో కాటేపల్లి ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు.12 రోజులు జరిగిన ఈ టోర్నమెంట్ లో వివిధ గ్రామాలనుండి 52 జట్టులు పాల్గొన్నాయి.ఈ పోటీలలో సంగోజీపేట్ గ్రామానికి చెందిన జట్టు మొదటి స్థానం లో నిలిచింది.వీరికి 22 వేల 222 రూపాయలు ప్రైజ్ మనీ ,కప్ ను నిర్వాహకులు అందజేశారు.అలాగే కాటేపల్లి గ్రామానికి చెందిన జట్టు రెండవ స్థానంలో నిలిచింది.ఈ జట్టుకు ద్వితీయ బహుమతి గా 11వేల 111రూపాయలు ప్రైజ్ మనీ,కప్ ను నిర్వాహకులు అందజేశారు.ఈ టోర్నమెంట్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా బర్ధావల్ కిషన్ నిలిచారు.ఈయనకు నిర్వాహకులు కప్ ను అందించి అభినందించారు. కాటేపల్లి ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్ కు కాటే పల్లి గ్రామస్తులు పెద్ద యెత్తున సహకరించారు.12 రోజుల పాటు ప్రతి జట్టుకు మల్లప్ప పటేల్ స్నాక్స్ అందించారు.అలాగే పనుగంటి బస్వరాజ్ మినరల్ వాటర్ అందించారు.రామాగౌడ్ ఆటగాళ్లకు జర్సిలు ఇప్పించారు.చివరిరోజు కొందరు దాతలు భోజన వసతి కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యువకులు,విద్యార్దులు పాల్గొన్నారు.
.