క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్ఆ సక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఎంపీడీవో రామకృష్ణ, ఎంఈఓ నాగయ్య

మన న్యూస్: పినపాక, గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం కల్పించేందుకు సీఎం కప్ ను 36 క్రీడాంశాల్లో మూడు దశల్లో పోటీలు నిర్వహిస్తామన్నారని పినపాక ఎంఈఓ నాగయ్య తెలిపారు. గురువారం పినపాక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అధ్యక్షతన వ్యాయామ ఉపాధ్యాయులతో, గ్రామపంచాయతీ సెక్రటరీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, ఎంఈఓ నాగయ్య లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 7 నుంచి సీఎం కప్ జరుగుతుందన్నారన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో గ్రామస్థాయిలో, 10 నుంచి 12 వరకు మండల, పురపాలిక, 16 నుంచి 21 వరకు జిల్లా, డిసెంబరు 27 నుంచి జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రథమ స్థానం సాధించిన వారికి బంగారు పతకంతోపాటు వ్యక్తిగత విభాగంలో రూ.20 వేలు, బృందానికి రూ.లక్ష, ద్వితీయ స్థాన పొందిన వారికి వెండి పతకం, వ్యక్తిగత విభాగంలో రూ.15 వేలు, బృందానికి రూ.75 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి కాంస్య పతకం, వ్యక్తిగత విభాగంలో రూ.10 వేలు, బృందానికి రూ.50 వేలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. సీఎం కప్ క్రీడల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు . గ్రామ, మండల, పురపాలిక స్థాయుల్లో అథ్లెటిక్స్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, యోగా ఉంటాయని, జిల్లా స్థాయిలో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, ఫుట్బాల్, వాలీబాల్, ఖో-ఖో, యోగా, చెస్, బేస్బాల్, కిక్బాక్సింగ్, సైక్లింగ్, వుషూ, జూడో, స్నూకర్ క్రీడలను నిర్వహిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల పీడీ లను,పిఈటి లను, గ్రామపంచాయతీ సెక్రటరీలను,ఎంఈఓ,ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ ఓ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ దిలీప్ ,పిడి వీరన్న,గ్రామపంచాయతీ సెక్రటరీలు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి