

కావలి : (మన ద్యాస న్యూస్) ప్రతినిధి సెప్టెంబర్ 15 ://
కావలి పట్టణంలో రామ్మూర్తి పేట, పుల్లారెడ్డి నగర్ మధ్యలో మద్యం దుకాణం నిర్వహించడం నిరసనగా 13 వార్డు టిడిపి అధ్యక్షుడు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు కావలి ఆర్డిఓ కి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కాలేజ్, దేవాలయం మధ్యలో బ్రాందీ షాపులు నిర్వహించడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.మద్యం సేవించి ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతున్నాయి దానివల్ల ప్రమాదాలు కూడా జరుగుతాయి ప్రమాదాలు జరగక ముందే ఆర్డీవో సానికూలంగా స్పందించి సమస్య పరిష్కరణ కృషి చేస్తున్న హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.