

పోరుమామిళ్ల: జూన్ 21: మన న్యూస్: నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ఈనెల 23వ తేదీన కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించే ‘యువత పోరు’ ధర్నాను విజయవంతం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పోరుమామిళ్ల పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే ‘యువత పోరు’ పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యువజన విభాగం ఎంతో కీలకమని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గురించే ఆలోచిస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలు మోసానికి గురవుతున్నారన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఏడాది గడిచినా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాదిగా ఉద్యోగాల కల్పన లేకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 23వ తేదీన కడప కలెక్టరేట్ ఎదుట యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యువతను భాగస్వామ్యం చేసుకుని విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అనంత మండిపడ్డారు. కేసులకు ఎవరూ భయపడొద్దని సూచించారు. ప్రజల పక్షాన పోరాట చేయాలని యువజన విభాగం నేతలకు సూచించారు.
ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, లేని పక్షంలో నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారన్నారు. ఏటా జనవరి 1వ తేదీనే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదని తెలిపారు. ఏడాది గడిచినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, ఒక్కరికీ నిరుద్యోగ భృతి అందకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా పీకేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో 6800 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్ రద్దు చేశారన్నారు. మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు, లోకేష్ తొలి సంతకాలు చేసినా ఇప్పటికీ పోస్టులు భర్తీ చేయలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 1.25 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎండీయూ ఆపరేటర్లు, ప్రభుత్వ మద్యం షాపుల్లో పని చేసే సూపర్వైజర్, సేల్స్మన్లను తొలగించి యువతను నిరుద్యోగులుగా మార్చారన్నారు.
వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ పథకాలను అందిస్తే ముసలోడు కూడా బటన్ నొక్కుతాడు అని చంద్రబాబు అవహేళన చేశారు. ఈ రోజు అదే ముసలోడిని అడుగుతున్నాం. బటన్ సరిగ్గా నొక్కలేకపోతున్నారా? మా ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశాం. ఇప్పుడు తల్లికి వందనం అని పేరు మార్చారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులుంటే కేవలం 30 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం అందించారు. వైఎస్ జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి తల్లులకు రూ.13 వేలు అందించారు. రూ.2 వేలను స్కూళ్ల అభివృద్ధికి కేటాయించి నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేశారు. అప్పట్లో చంద్రబాబు, లోకేష్, కూటమి నేతలంతా అమ్మ ఒడిలో రూ.2 వేలు జగన్ కోత పెట్టాడని విమర్శించారు. ఆ డబ్బు జగన్ జేబులోకి వెళ్తోందని అన్నారు. అప్పట్లో మీరు తల్లికి వందనం కింద రూ.15 వేలు అందిస్తామని, కోతలుండవని హామీ ఇచ్చారు. కానీ నేడు జరుగుతోంది ఏంటి? రూ.15 వేలలో రూ.2 వేలు కోత పెట్టారు. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటం చేస్తాం’’ చెప్పారు ఈనెల 23వ తేదీన యువజన విభాగం ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. యువజన విభాగం నాయకులు, కార్యకర్తలంతా ‘యువత పోరు’ను విజయవంతం చేయాలన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో యువ నాయకులు చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి , జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు సాయి నారాయణ రెడ్డి, జిల్లా యువజన విభాగ కార్యవర్గ సభ్యుడు జగదీష్ రెడ్డి, మండల వాలంటరీ వింగ్ అధ్యక్షులు శివ, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు పొదిలి మస్తాన్ మనీ, జిల్లా విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ నెంబర్ కే శివకుమార్, సెల్ పాయింట్ భాష, రసూల్, వెంకటేష్, ఆది బోయిన శ్రీకాంత్ యాదవ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
