నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

మన న్యూస్, నెల్లూరు రూరల్:రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి సంబరాలు చేసుకుంటుందని వైయస్ఆర్ సీపీ నెల్లూరు రూరల్‌ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వెన్నుపోటు దినం’’ కార్యక్రమంలో బాగంగా నగరంలోని రైల్వేఫీడర్స్‌రోడ్డులోని వెటర్నరీ హాస్పిటల్‌ నుంచి ఆర్‌డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆర్‌డీఓ కార్యాలయంలోని అధికారికి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగా విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ….ఏడాది కాలంలో ఒక్కహామీ కూడా నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుందని మండిపడ్డారు. వాలంటీర్‌లకు రూ.5వేలును రూ.10వేలు చేస్తామని వారిని నిర్దాక్ష్యణ్యంగా తొలగించారన్నారు. మహిళలకు ఉచిత బస్సు కల్పిస్తామని ఆ ఊసేలేకుండా ప్రభుత్వం మిన్నకుండిపోయిందని తెలిపారు. ఇంటి వద్దకే వెళ్తున్న రేషన్‌ వాహనాలను నిలిపివేసి, నడిచివెళ్ళి రేషన్‌ సరుకులు తెచ్చుకోవాలని చెప్పడం దారుణమన్నారు. విధ్యార్దులకు రూ.15వేలు , మహిళలకు రూ.18వేలు ఇస్తామని, ప్రతి నెలా మహిళలకు రూ.15వందలు అకౌంట్‌లలో వేస్తామని భూటకపు హామీలు కురిపించి ప్రజలను చంద్రబాబునాయుడు మరోసారి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు 20లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటలు నీటిమూటలుగా మిగిలిపోయాయని యద్దేవాచేశారు.ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కువ శాతం ఏపీలో మహిళల పై అరాచకాలు జరిగాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఉన్నామని మరిచి కక్షసాధింపులు, రాజకీయ కక్షలకు తెగబడుతున్నారన్నారు. రాష్ట్రంలో రాకీయ కక్షసాధింపు, రాజకీయ హత్యల కారణంగా 390 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి ఇచ్చిన హామీలు కంటే చంద్రబాబునాయుడు ఎక్కువ హామీలు ఇవ్వడంతో చేస్తారనే ఆశతో ప్రజలు మోసపడ్డారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    Mana News :- ఏపీ రాష్ట్ర చరిత్రలోనే వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు లభించాయి. వీరిలో వైకాపా సానుభూతి ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే, ఈ ప్రమోషన్లలో ఎలాంటి తారతమ్యాలు కల్పించ లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.కానీ ప్రభుత్వ ఉద్యోగులు…

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్): సృష్టికి ప్రత్యేక అలంకరణలో ప్రసిద్ధిగాంచినవి పల్లె పట్టుకొమ్మలు… చక్కని ప్రకృతి లో వ్యవసాయం చేస్తూ, తమ పిల్లలను బడికి పంపుతున్న బుల్లి రోడ్లో పెద్ద పెద్ద వాహనాలు… గత కొన్ని సంవత్సరాలుగా భారీ లోడుతో నిత్యం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    బక్రీద్ పండుగ వేడుకలు

    • By RAHEEM
    • June 8, 2025
    • 3 views
    బక్రీద్ పండుగ వేడుకలు

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    నెల్లూరులో చివరి దశకు చేరుకున్న విఆర్ హైస్కూల్ ఆధునికరణ పనులు

    నెల్లూరులో చివరి దశకు చేరుకున్న  విఆర్ హైస్కూల్ ఆధునికరణ  పనులు

    నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి

    నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి