సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయక శాఖ మంత్రివర్యులు ఆనం రామ నారాయణరెడ్డి రెడ్డి

‌. మన న్యూస్, ఆత్మకూరు ,మే 11: ఆత్మకూరు నియోజకవర్గంలో 22 మంది లబ్ధిదారులకు 37 లక్షల 25వేల 213 రూపాయలు చెక్కుల రూపంలో అందజేసిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఆత్మకూరు మండలంలో ఆరుగురికి, మర్రిపాడు లో నలుగురికి, ఏఎస్ పేటలో ఒకరికి, అనంతసాగరంలో ముగ్గురికి, చేజర్ల మండలంలో ఐదుగురికి ఇతరులకు రెండు చెక్కులు అందజేసిన మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 205 కుటుంబాలకు 2 కోట్ల 60 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశాం.ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా పథకం వర్తించని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశాం అని అన్నారు.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నెల్లూరు జిల్లా నాన్ డెల్టా లో కూడా రెండో పంటకు సాగునీరు ఇస్తున్నాం అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం రెండవ పంటకు డెల్టాలో సుమారు రెండు లక్షల ఎకరాలకు, నాన్ డెల్టా కింద 1,64,000 ఎకరాలకు, తెలుగు గంగ ప్రాజెక్టు కింద 1,60,000 ఎకరాలకు. రబీ పంటకు మొత్తం 5.24 లక్షల ఎకరాలు సాగునీరు అందించడం జరుగుతుంది అని అన్నారు.గత 45 సంవత్సరాలు తన రాజకీయ జీవితంలో అత్యధికంగా 1,80,000 ఎకరాలకు మాత్రమే రెండవ పంటకు నీరు ఇవ్వగలిగాం. కానీ ఈ ఏడాది 5.24 లక్షల ఎకరాలకు అందిస్తున్నాం అని అన్నారు. సోమశిల ప్రాజెక్టు మరమ్మత్తులకు నిధులు విడుదల చేయాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అని అన్నారు. కొత్త షెటర్లు, రోప్లు, గ్రీజు పెట్టడాని అధికారులు, చర్యలు తీసుకుంటున్నారు అని తెలిపారు.టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. విశాఖ పట్నానికి చెందిన స్వర్ణ సంస్థకు టెండర్లు దక్కాయి. త్వరలో ఈ పనులు మొదలవుతాయి అని తెలిపారు. సోమశిల హై లెవెల్ కెనాల్ భూసేకరణకు నిధులు విడుదల చేయాలని స్పెషల్ సిఎస్ కు కేబినెట్ లో CM ఆదేశాలు ఇచ్చారు అని అన్నారు. హంద్రీనీవాకు నిధులు సమకూర్చి ఈ ఏడాది పూర్తిచేసి చివరి భూములకు కుప్పం వరకు నీరు అందించాలని సీఎం ఆదేశించారు అని తెలిపారు.వాగు,చెరువు,నదీ పరివాహక ప్రాంతాలకు ఇబ్బంది లేని భూములను పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు.ఇండియాతో యుద్ధం చేసే స్థాయి పాకిస్తాన్ కు లేదు అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఉగ్రవాదుల దయాదాక్షణ్యాల మీద మీద బ్రతుకుతున్న దేశం పాకిస్తాన్,భారతీయులంతా ఒక్కటై మిలిటరీ కి తోడుగా ఉండి పాకిస్తాన్ దుశ్చర్యలను తిప్పి కొడతాం అని అన్నారు.పాకిస్తాన్ విధానం ఉగ్ర విధానం,మిలటరీ చేతుల్లో బందీ అయిన ప్రభుత్వం పాకిస్తాన్, మహిళా కమాండర్ల దెబ్బకు పాకిస్తాన్ బెంబేలెత్తింది అని అన్నారు. ఆపరేషన్ సింధూర్లో మహిళా శక్తి ముందుండి నడిపించింది అని తెలిపారు.పాకిస్తాన్తో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళి నాయక్ కుటుంబానికి సంతాపం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని అన్నారు. పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మనమంతా రుణపడి ఉంటాం అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలియజేశారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!