మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలో గోర్గల్ గేటు వద్ద సొసైటీ ఫంక్షన్ హాల్ లోని గ్రోమోర్ సురక్ష (
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సమావేశంలో రైతులకు ప్రస్తుత వరి పంటలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు గురించి నిపుణులు సవివరంగా తెలియజేశారు.
హైదరాబాద్ జోన్ అధికారి ప్రపుల్లా మాట్లాడుతూ – పంటలో సరైన సమయంలో మందుల వాడకం, పురుగుమందుల మోతాదులు,పద్ధతుల గురించి రైతులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
కామారెడ్డి టి.ఎం సుమ గాంధే రైతులకు – గ్రోమోర్ సురక్ష ఉత్పత్తులు పంటలో రోగాలను తగ్గించడమే కాకుండా దిగుబడిని పెంచే విధంగాఉపయోగపడతాయని వివరించారు.

యెల్లారెడ్డి పి.టి.జీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ – పంటను ఎటువంటి దశలో ఏ రసాయనాన్ని వాడాలో, కలుపు నివారణకు సమర్థవంతమైన పద్ధతులు ఏవో రైతులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాగి,గొర్గల్, వడ్డేపల్లి,నిజాంసాగర్, అచ్చంపేట గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం రైతులు ప్రతినిధులను ప్రశ్నలు అడిగి సందేహాలు నివృత్తి చేసుకున్నారు.రైతులు గ్రోమోర్ సురక్ష ఉత్పత్తులు వాడితే అధిక దిగుబడులు సాధించవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *