మన న్యూస్,*నిజాంసాగర్* (జుక్కల్):కామారెడ్డి జిల్లా PACS సొసైటీ సీఈఓలు ఉద్యోగుల యూనియన్‌ నూతన జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నికలు ఉత్సాహభరితంగా జరిగాయి. పిట్లం క్లస్టర్ ఉద్యోగులు ఓటు వేసి తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు.
ఎన్నికైన సభ్యులు:
1️⃣ అంతంపల్లి శ్రీనివాస్ – అధ్యక్షులు
2️⃣ సంగగోని సంగమేశ్వర్ – ప్రధాన కార్యదర్శి
3️⃣ మందాడి సంతోష్ రెడ్డి – అసోసియేట్ ప్రెసిడెంట్
4️⃣ సాయి ప్రకాశ్ – కార్యవర్గ సభ్యుడు
5️⃣ భాస్కర్ – కార్యవర్గ సభ్యుడు
6️⃣ ఎర్గే వీరేశం – కార్యవర్గ సభ్యుడు
7️⃣ శ్రవణ్ కుమార్ – కార్యవర్గ సభ్యుడు
8️⃣ లలిత – కార్యవర్గ సభ్యురాలు,ఎన్నిక అనంతరం, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారిని శాలువాలు కప్పి,పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ .ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు యూనియన్ దృష్టికి తీసుకువస్తే,వాటి పరిష్కారానికి కట్టుబడి కృషి చేస్తాం అన్నారు.
ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ కూడా సభ్యుల ఐక్యతతో యూనియన్ మరింత బలపడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *