డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 6,7,8,9 వ తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు…

తుని మన న్యూస్ (అపురూప్):- రాష్ట్రంలోని డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 వ తరగతుల్లో మిగిలిన సీట్ల అడ్మిషన్ల కోసం ధరఖాస్తులను చేసుకోవాలని తుని అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ కనిగిరి విశ్వేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. తుని అంబేద్కర్ గురుకులం పాఠశాలలో మరియు ఆయా పాఠశాలల్లో ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 25వ తేదీ (25 జూన్ 2025 )పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎస్సి, ఎస్టీ, బీసీ వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.6. వ తరగతి 3,095, 7. వ తరగతి 1255, 8. వ తరగతి 882, 9. వ తరగతి 875రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ సీట్లలో భర్తీ చేయడం జరుగుతుందన్నారు.గురుకుల పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు మరియు ప్రవేశ పరీక్షల తేదీలు ఇటువలె ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టట్యూషన్ సొసైటీ ప్రధాన కార్యాలయం నుండి ఖరారు చేశారన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులకే అడ్మిషన్ అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇతరులు ప్రవేశానికి అర్హులు కారని,. పరీక్షా తేదీలు మరియు వివరాలుప్రకటించడం జరిగిందన్నారు.1. 5వ తరగతికి (ఆడ పిల్లల కోసం) స్పాట్ అడ్మిషన్ తేదీ: 22.06.2025 వేదిక: ఎస్‌.ఎమ్‌.నగర్, కాకినాడ2. 5వ తరగతికి (అబ్బాయిల కోసం) స్పాట్ అడ్మిషన్  తేదీ: 23.06.2025  వేదిక: ద్రాక్షారామం3. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు (ఆడ పిల్లల కోసం) ప్రవేశ పరీక్ష  తేదీ: 25.06.2025  వేదిక: ఎస్‌.ఎమ్‌.నగర్,కాకినాడ4. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు (అబ్బాయిల కోసం) ప్రవేశ పరీక్ష  తేదీ: 25.06.2025  వేదిక: ఎల్‌.ఎన్‌.పురం5. జూనియర్ ఇంటర్ తరగతికి (ఆడ పిల్లల కోసం) స్పాట్ అడ్మిషన్  తేదీ: 26.06.2025  వేదిక: పి.వెంకటాపురం6. జూనియర్ ఇంటర్ తరగతికి (అబ్బాయిల కోసం) స్పాట్ అడ్మిషన్  తేదీ: 27.06.2025  వేదిక: ద్రాక్షారామం ఆయా ప్రదేశాలలో పరీక్షలో నిర్వహించడం జరుగుతుందని దరఖాస్తులు చేసుకున్న వారు పరీక్షకు హాజరుకావాలని తుని అంబేద్కర్ గురుకులం ( బాయ్స్) ప్రిన్సిపాల్ కనిగిరి విశ్వేశ్వరరావు తెలిపారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!