నెల్లూరులో జూన్ 4 తేదీన వైయస్ఆర్సీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేయండి ….ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు:నెల్లూరు లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ……… కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతోమంది పేదలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, వ్యాపారస్తులు, పెన్షనర్లు, వృద్ధులు ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే . ఈ రోజు వారందరు రోడ్డును పడ్డారని అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ,రైతులకు ఏడాదికి 20,000 ఇస్తామన్న రైతు భరోసా, నిరుద్యోగులకు నెలకు 3000 చొప్పున సంవత్సరానికి 36,000, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నారు,అలాగే మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500, 50 ఏళ్ళు నిండిన బీసీ వారికి పెన్షన్ అన్నారు, ఉద్యోగులకు ఐ ఆర్, పి ఆర్ సి అన్నారు,ఇలా అనేక హామీలు ఇచ్చి.. వాటిని నెరవేర్చకుండా తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రతి ఒక్కరిని మోసం చేసిందన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన అని చెబుతూ.. ఈరోజు ప్రభుత్వం 3 లక్షల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించి.. రోడ్డును పడేసిందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అందడం లేదు. విద్యుత్ ఛార్జీలను.. ప్రభుత్వం విపరీతంగా పెంచి.. ప్రజలను ఇబ్బందులకు గురి గురిచేస్తుండడంతో.. ప్రజలు ఈరోజు ఆ బిల్లులను చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతి ఒక్కరూ ప్రజల పక్షాన నిలబడి పోరాడండి అని.. మా అందరిని ముందుండి నడిపించడం జరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చేతిలో ప్రజలు ఎలా మోసపోయారో.. తెలియజేసేలా జూన్ 4వ తేదీ.. జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తుందని తెలిపారు.జూన్ 4వ తేదీన చేపట్టబోయే వెన్నుపోటు దినం కార్యక్రమానికి ప్రజలు తరలివచ్చి .. నిరసన తెలియజేసినప్పుడే ప్రభుత్వం మేల్కొంటుందని.. సామాన్య ప్రజల బాధలను అర్థం చేసుకుంటుందని తెలిపారు. జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినట్లైతే ప్రభుత్వాన్ని మనం నిద్రలేపిన వాళ్లమవుతామన్నారు. ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి విఆర్సి సెంటర్లో ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ప్రజలతో కలిసి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్న డిమాండ్ ను కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి పంపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జూన్ 4వ తేదీ.. ఉదయం 10 గంటలకు వి ఆర్ కాలేజ్ వద్దకు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా విచ్చేసి.. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని.. ప్రతి ఒక్కరికి సవినయంగా మనవి చేసుకుంటున్నానన్నారు.

  • Related Posts

    నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ

    మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…

    యోగా తో ఆరోగ్యం,ఆనందం.

    మన న్యూస్ సాలూరు జూన్7:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మే 21నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి