ఐరాల డిసెంబర్ 22 మన న్యూస్

ఏబిసిడి అవార్డు అందుకున్న కార్వేటినగరం సిఐ హనుమంతప్పని కలిసిన తిరుమల హరినాథ్. ఆదివారం కార్వేటి నగరం సీఐ హనుమంతప్పని మర్యాదపూర్వకంగా కలిసిన ఐరాల మండలం వేదగిరి వారి పల్లి పంచాయతీ జనసేన పార్టీ వైస్ సర్పంచ్ తిరుమల హరినాథ్ మర్యాదపూర్వకంగా కలిసి ఏ బి సి డి అవార్డు అందుకున్న శుభ సందర్భంగా సిఐ హనుమంతప్ప ని దుశ్యాలవతో ఘనంగా సన్మానించారు. తిరుమల హరినాథ్ మాట్లాడుతూ ఇటువంటి అవార్డులను మరిన్ని అలంకరించాలని మనస్పూర్తిగా కోరుకున్నట్లు తెలియజేశారు. సాధారణ కుటుంబం లో పుట్టి ఈ స్థాయికి ఎదిగి పై స్థాయి అధికారుల దగ్గర నుండి అవార్డు అందుకోవడం గర్వకారణం అని తెలిపారు. సిఐ నీ సన్మానించిన కార్యక్రమంలో ధనుష్ రాయల్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు కిషోర్ రాయల్, రవీంద్రనాథ్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *