రెండేళ్లలో రాజధాని పూర్తి చేస్తాం…. నెల్లూరులో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు: మరో రెండేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. అమరావతికి 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్.. అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటూ కొత్త డ్రామాకు తెరలైపోయారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతూ ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయిన వైసిపి.. దానిపై దుష్ప్రచారానికి దిగుతుందన్నారు. అల్లిపురం డంపింగ్ యార్డ్ లో లెగిసి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వద్ద పనులను పరిశీలించిన నారాయణ అధికారులకు పలు సూచనలు చేశారు. రీసైక్లింగ్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. గత వైసిపి ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసి వెళ్లిపోయిందని.. 50% చెత్తను రీసైక్లింగ్ చేశామని మంత్రి వెల్లడించారు. అక్టోబర్ రెండు నాటికి ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని వివరించారు. మహిళలంటే వైసీపీకి గౌరవం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మహిళను వేశలంటూ కించపరిచారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని 50 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని వివరించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు.. నగర అధ్యక్షుడు మామిడాల మధు..జిల్లా అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజి,పాకాలపెంచలయ్య,బాబురావు,నాగేశ్వరరావు,సురేష్,సుబ్బలక్ష్మి,మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..