

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: బద్వేల్ పట్టణం నందు జయ సుబ్బారెడ్డి కాలేజ్ ప్రక్కన గత 50 సంవత్సరాల క్రితం నుండి మాబు సుభాని దర్గా( జండా చెట్టు )ఉన్నది నిన్నటి దినం మున్సిపల్ అధికారులు దర్గా ప్రహరీ గోడను కూల్చడం జరిగింది , గురువారం ముస్లిం నాయకులు కూల్చిన ప్రాంతానికి వెళ్లి పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్షులు పి చాంద్ భాష ,మాస్ కమిటీ అధ్యక్షులు ఎస్,అల్లా బా క ష్ ,ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా ,జిలాని భాష ,కౌన్సిలర్ మహమ్మద్ హుస్సేన్ లు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో ఇలాంటి ఘటనలకు జరగడం బాధాకరం అన్నారు. ఇక్కడ 50 సంవత్సరాల నుండి దర్గా జండా చెట్టు ఉన్నది ఈ దర్గాకు హిందూ ముస్లిం సోదరులు ఇక్కడే ప్రార్థన చేసుకొని వెళ్లేవారు. అలాంటిది మున్సిపల్ అధికారులు దర్గా ప్రహరీ గోడలను కూల్చి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. మందిరాలు ,మసీద్ లు దర్గాలు ,చర్చిలు ,ఇతర ప్రార్థన మందిరాలు ఇవి చాలా పవిత్రమైనవి,చాలా సున్నితమైనవి , ఏదైనా సమస్య వస్తే ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకుని ఒకరికొకరు అర్థం చేసుకొని సమస్య పరిష్కారం చేసుకోవాలి ,అలాంటిది మున్సిపల్ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా దర్గా గోడను కూల్చడం జరిగింది. వాస్తవంగా ఆ దర్గా ఏ రోడ్డుకు కూడా అడ్డంగా లేదు అలాంటిది దర్గా గోడ కూల్చడం చాలా దుర్మార్గం ,ఈ విషయం పైన బద్వేల్ మున్సిపల్ కమిషనర్ ని దర్గా గోడను ఎందుకు కూల్చారని వివరణ కోరగా రోడ్డుకు అడ్డంగా ఉన్నదని పొంతన లేని మాటలు చెప్పారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కూల్చిన ప్రహరీ గోడను నిర్మించి మతసామరస్యాన్ని కాపాడాలన్నారు. ,ప్రహరీ గోడను నిర్మించకుండా నిర్లక్ష్యం చేస్తే అన్ని రాజకీయ పార్టీలను ప్రజాసంఘాలను లౌకికవాదుల్ని భక్తులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ కార్యదర్శి అన్వర్ భాష ,ముస్లిం నాయకులు షరీఫ్,బాబ్జి ,మాహీర్ ,రెడ్డి భాష ,మౌలాలి ,ఇబ్రహీం ,సర్దార్ ,మరియు ముస్లిం సోదరులు ,మహిళలు పాల్గొన్నారు.