దుత్తలురు, జూలై 08 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం నరవాడలో జరుగుతున్న శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఉదయగిరీ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు ఆయన ఇద్దరు కుమారులతో ఆలయం కి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. చాలాకాలం తర్వాత వీరిద్దరూ అమ్మవారి సన్నిధిలో ఇలా కలవడం పట్ల చూసిన టీడీపీ నేతలల్లో కలిగిన ఆనందం వెల్లువ.