

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో పల్లె దవఖాన ప్రాంగణంలో వాకిటి శ్రీహరి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం అయిందని సేవా సమితి వ్యవస్థాపకులు ఏ రవికుమార్ తెలిపారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి గణేష్ కుమార్, మక్తల్ పట్టణ మాజీ ఉపసర్పంచ్ కట్ట సురేష్ కుమార్ గుప్తా ప్రారంబించారు.ఈ సందర్భంగా సేవ సమితి వ్యవస్థాపకులు ఏ రవికుమార్ మాట్లాడుతూ,మక్తల్ నియోజకవర్గ ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేటట్లు నిరంతరం శ్రమిస్తూ నేడు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారి సహకారంతో రామ్ రెడ్డి లయన్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో గుడిగండ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమన్వయంతో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందని తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో గుడిగండ్ల గ్రామ పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగిందని తెలిపారు. సుమారు 85 మందికి పైగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా 38 మందికి పైగా కంటిపోరల సమస్యలు ఉన్నట్లు గుర్తించి,వారిని ఆపరేషన్ నిమిత్తముకై మహబూబ్నగర్ రామ్ రెడ్డి లాయర్స్ హాస్పిటల్కు ప్రత్యేక వాహనంలో తరలించడం జరిగిందని తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మక్తల్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కంటి వైద్య శిబిరాలతో పాటు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందించడంలో ఎమ్మెల్యే గారి సహకారం పట్ల గుడిగండ్ల గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇట్టి ఉచిత వైద్య క్యాంపులను సద్వినియోగం పరుచుకోవాలని కోరారు. కంటి చూపు లోపం ఉన్నవారికి వయోవృద్ధులైనటువంటి వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ కంటి ఆపరేషన్ తో పాటు ఉచితంగా మందులు అద్దాలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి క్యాంపును ఏర్పాటు చేసే విద్యావంతం చేసిన వాకిటిసిఆర్ సేవా సమితి బృందానికి పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు శ్రీనివాస్ రెడ్డి జ్యోతి సత్యం గౌడ్ మోహన్ గౌడ్ పంచాయతీ సెక్రెటరీ పంచాయతీ వర్కర్స్ గుడిగండ్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
