వాకిటి శ్రీహరి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో పల్లె దవఖాన ప్రాంగణంలో వాకిటి శ్రీహరి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం అయిందని సేవా సమితి వ్యవస్థాపకులు ఏ రవికుమార్ తెలిపారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి గణేష్ కుమార్, మక్తల్ పట్టణ మాజీ ఉపసర్పంచ్ కట్ట సురేష్ కుమార్ గుప్తా ప్రారంబించారు.ఈ సందర్భంగా సేవ సమితి వ్యవస్థాపకులు ఏ రవికుమార్ మాట్లాడుతూ,మక్తల్ నియోజకవర్గ ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేటట్లు నిరంతరం శ్రమిస్తూ నేడు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారి సహకారంతో రామ్ రెడ్డి లయన్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో గుడిగండ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమన్వయంతో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందని తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో గుడిగండ్ల గ్రామ పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగిందని తెలిపారు. సుమారు 85 మందికి పైగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా 38 మందికి పైగా కంటిపోరల సమస్యలు ఉన్నట్లు గుర్తించి,వారిని ఆపరేషన్ నిమిత్తముకై మహబూబ్నగర్ రామ్ రెడ్డి లాయర్స్ హాస్పిటల్కు ప్రత్యేక వాహనంలో తరలించడం జరిగిందని తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మక్తల్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కంటి వైద్య శిబిరాలతో పాటు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందించడంలో ఎమ్మెల్యే గారి సహకారం పట్ల గుడిగండ్ల గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇట్టి ఉచిత వైద్య క్యాంపులను సద్వినియోగం పరుచుకోవాలని కోరారు. కంటి చూపు లోపం ఉన్నవారికి వయోవృద్ధులైనటువంటి వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ కంటి ఆపరేషన్ తో పాటు ఉచితంగా మందులు అద్దాలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి క్యాంపును ఏర్పాటు చేసే విద్యావంతం చేసిన వాకిటిసిఆర్ సేవా సమితి బృందానికి పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు శ్రీనివాస్ రెడ్డి జ్యోతి సత్యం గౌడ్ మోహన్ గౌడ్ పంచాయతీ సెక్రెటరీ పంచాయతీ వర్కర్స్ గుడిగండ్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..