ది ఆదర్శ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బడంగ్పేట్ బ్రాంచ్ ప్రారంభం

మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ది ఆదర్శ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క బడంగ్పేట్ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం ముఖ్య అతిథిగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ది ఆదర్శ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మదన గోపాల స్వామి మాట్లాడుతూ బడంగ్పేట్ ప్రాంత అభివృద్ధిలో భాగంగా తాము ఇక్కడ బ్రాంచ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ బ్యాంకు చిరు వ్యాపారులకు వారి అవసరమును బట్టి పదివేల నుండి 50వేల రూపాయల వరకు రుణాలను మంజూరు చేస్తుందని తెలిపారు. పరిశ్రమలకు,పారిశ్రామిక అభివృద్ధికి 5 లక్షల నుండి 5 కోట్ల వరకు రుణాలు మంజూరు చేయగలమని తెలిపారు. ఈ బ్యాంకు యొక్క మొదటి బ్రాంచ్ ను 1998లో జీడిమెట్ల షాపూర్ నగర్ లో పారిశ్రామిక అభివృద్ధి సముదాయమునకు దగ్గర్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ది ఆదర్శ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను స్థాపించిన ఈ 27 సంవత్సరాలలో బడంగ్పేట్ బ్రాంచ్ ను 34వ బ్రాంచ్ గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు వినియోగదారులు సేవలు వినియోగించుకోవచ్చని బ్యాంకు తెరిచి ఉంచబడునని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ది ఆదర్శ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మదన గోపాల స్వామి,డిజీఎం అయ్యప్ప నాయుడు,,ఏజీఎం కామినేని శ్రీనివాస రావు బ్రాంచ్ మేనేజర్ బ్రహ్మయ్య,గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, బండారి మనోహర్, రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..