

పలుచోట్ల అన్నదానం – ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ
Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ,మన న్యూస్…. తెలుగుదేశం పార్టీ నాయకులు లక్కమనేని మధుబాబు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. టీడీపీ శ్రేణులు, అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల నడుమ అత్యంత వేడుకగా ఈ వేడుకలు నిర్వహించారు. తొలుత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని వేదపండితులు ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత నేరుగా పీవీ రోడ్డులోని కార్యాలయానికి చేరుకున్న మధుబాబుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇక్కడ భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. పట్టణంలోని వెల్లం పాలెం, బహుదూర్ పేట, రామసేతు వంతెన తదితర ప్రాంతాల్లో జరిగిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. సాయంత్రం గాలి గోపురం సమీపంలో మిత్రులు, శ్రేయోభిలాషులు అభిమానుల మధ్య భారీ కేక్ కటింగ్ నిర్వహించారు.ఇదిలా ఉంటే అభిమానులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అందించారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చరవాణీ ద్వారా మధుబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, జనసేన నాయకులు, పలువురు స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కన్నలి ప్రతాపరెడ్డి, కన్నలి ప్రవీణ్ రెడ్డి, శ్రీకాళహస్తి జడ్పిటిసి కాపీరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటాచలం, మాజీ కౌన్సిలర్ రవీంద్రబాబు, ఉన్నం ప్రసాద్, నవీన్, వంశి, సోము, భార్గవ్, దశరథ, తదితరులు పాల్గొన్నారు.
