హాల్ టికెట్ల పేరుతో విద్యార్థులను వేధిస్తే చర్యలకు సిద్ధం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం

మనన్యూస్:ఈ నెల 17 నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్ల జారీలో ఫీజులు పెండింగ్ లో ఉన్నాయన్న నెపంతో జిల్లాలో పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు హాల్ టికెట్లలో స్కూల్ ప్రిన్సిపాల్ సంతకాలు, స్టాంపులు ఉండాల్సిందేనన్న నిబంధనలు పెట్టి విద్యార్థులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు ఫిర్యాదులు అందడంపై సీరియస్ గా తీసుకుంటున్నట్టు కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యాలు ఫీజులుపై ఈ సమయంలో ఒత్తిడిని పెంచడం సమంజసం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు సూచనలు జరీచేసిందని గుర్తు చేశారు, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ లో హాల్ టికెట్ల జారీ ప్రక్రియ మొదలు పెట్టిందని గుర్తు చెప్పారు. ఈ హాల్ టికెట్లతో నేరుగా జిల్లాలోని విద్యార్థులు నిరభ్యంతరంగా పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు వ్రాయవచ్చని అన్నారు,ఈ విషయంలో వారి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని సూచించారు.అలాగే ప్రభుత్వం ఆన్లైన్ హల్ టికెట్ల జారీపై తమ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు నేతృత్వంలో అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు వివిధ రూపాల్లో అవగాహనా కార్యక్రమాలు, ప్రచార, ప్రసార సాధనాలు ద్వారా విస్తృత పరచాలని ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు,ఇంకా ఈ హాల్ టికెట్ల జారీ పేరుతో యాజమాన్యాలు గందరగోళ పరిస్థితులు సృష్టిస్తే తమ కమిషన్ చట్ట ప్రకార చర్యలతో పాటు ఆయా యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానికి,ఆయా జిల్లాల కలెక్టర్లు,ఉన్నతాధికారులకు వివిధ సిఫారసులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీతారాం చెప్పారు,సమస్యలుంటే apscpcr2018@gmail.com ఫిర్యాదులు చేయవచ్చని సీతారాం చెప్పారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు