ఆ 11 మందిని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Mana News :- ప్రజలు 11 మంది వైసీపీ నేతలను శాసన సభ్యులుగా గెలిపిస్తే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన 10టీవీతో మాట్లాడుతూ… ఆ 11 మందిని ఎందుకు గెలిపించామా అని ప్రజల బాధపడుతున్నారని చెప్పారు.“శాసనసభ సెట్టింగ్ ని ఇంట్లో వేసుకొని సమావేశాలు నిర్వహించుకుంటారా? గతంలో తిరుపతి సెట్టింగ్ ని ఆయన ఇంట్లో వేసుకున్నారు. ఐదు సంవత్సరాలు మీడియా ముందుకు రాని ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోయారు. 10 శాతం మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ఆయనకు తెలియదా? 11 మంది సభ్యులు ఉంటే చేతులెత్తేశారు. ఒకప్పుడు ఇద్దరు సభ్యులు ఉన్న బీజేపీ ఈరోజు దేశాన్ని పాలిస్తోంది. జగన్ కి ఎందుకంత అహంకారం? చట్టాలపై ఆయనకు నమ్మకం లేదు.. నిజంగా నేను బాధపడుతున్నాను.. అసెంబ్లీలో జగన్ ముఖం ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. జగన్ కి అవకాశం వస్తే ఓ నియంత. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఓ పిరికిపంద” అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

Related Posts

పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

మన న్యూస్, నెల్లూరు : నిరుపేదలు తమ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో వారు పడుతున్న ఇబ్బందులను దగ్గర్నుంచి చూశాను కాబట్టే.. ప్రతి స్టూడెంట్ కి నాణ్యమైన విద్యను అందించాలని వి ఆర్ హైస్కూల్ ని తీర్చిదిద్దుతున్నానని మంత్రి పొంగూరు…

మూడవ రోజు రాత్రి వాహన సేవ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు (08-06-2025, ఆదివారం) రాత్రి 8 గంటలకు హంస వాహన సేవను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారు హంస…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

మూడవ రోజు రాత్రి వాహన సేవ

మూడవ రోజు రాత్రి  వాహన సేవ

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర