

కాకినాడ / గొల్లప్రోలు మార్చి 10 మన న్యూస్:- హోప్ హైలాండ్ లో ఎకో టూరిజంని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులు ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్..జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్, జిల్లా అటవీ శాఖ అధికారి ఎ.రవీంద్రనాథ్ రెడ్డి, పోర్టు అధికారి కెప్టెన్ ధర్మశాస్త, అటవీ, పర్యాటక, మత్స్య, మెరైన్ పోలీస్ శాఖల అధికారులతో కలిసి హోప్ ఐలాండ్ లో పర్యటించారు. కాకినాడ సముద్ర తీరంలో ఉన్న రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం కార్యాలయం నుంచి హోప్ ఐలాండ్ కు చేరుకుని అక్కడి ప్రదేశాలను పరిశీలించారు. ఎకో టూరిజంని అభివృద్ధికి అనువుగా ఉన్న పరిస్థితులు, హోప్ హైలాండ్ పరిధి, మడ అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, సందర్శకులకు బోటింగ్ సౌకర్యం ఇతర అంశాలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్..ఆయా శాఖల అధికారులతో ఈ సందర్భంగా చర్చించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోప్ ఐలాండ్ ప్రాంతాన్ని పర్యాటక రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా మత్స్యశాఖ అధికారి కె. కరుణాకర్ బాబు, ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్ఎస్ఆర్.వరప్రసాద్, సెక్షన్ అధికారి ఎం. నాగార్జున, అసిస్టెంట్ టూరిజం అధికారి వి. త్రిమూర్తులు, వాటర్ ఫ్లీట్ అసిస్టెంట్ మేనేజర్ గంగా బాబు, పోర్ట్ సీఐ పీ.సునీల్ కుమార్, మెరైన్ ఎస్సై పీ.సురేష్ ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
