ఆదర్శ ఇంజనీరింగ్ కళాశాల లో ఘనంగా మహిళా దినోత్సవం

గొల్లప్రోలు మార్చి 8 మన న్యూస్ :– గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బుర్రా అనురాధ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. మానవ జీవితంలో మహిళ పాత్ర వెలకట్టలేనిదని, మహిళలు మానవాళికి దిక్సూచి అని తెలియజేశారు.ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా ట్రైనీ ఐపీఎస్ అధికారి సుస్మితా రామనాధన్ మాట్లాడుతూ…నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారని, ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానిని సాధించేంతవరకు కృషి పట్టుదలతో పోరాడితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చని తెలియజేశారు. అనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ జె.రాజేశ్వరి మాట్లాడుతూ.. మహిళలు భాగస్వామ్యంతో సమాజంలో సంపద సృష్టించవచ్చని, ఇతర విషయాల పై దృష్టి సారించకుండా ఉన్నతంగా విద్యను అభ్యసించి సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని సూచించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, పోషకాహార పదార్థాలు తీసుకోవడంతో పాటు పని ఒత్తిడి లేకుండా చూసుకుని కుటుంబానికి ఆహ్లాదకరమైన వాతావరణ నెలకొల్పేందుకు కృషి చేయాలని గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్. సరస్వతి సూచించారు. అనంతరం ప్యానల్ అడ్వకేట్ ఏ.దేవి మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని, పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు ఉన్నాయని, ముఖ్యంగా మహిళలు ఆత్మ సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల నందు మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన పలు ఆటల పాటల పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.కళాశాల అధ్యాపక సిబ్బంది విద్యార్థినులు అతిధులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Related Posts

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ