మహిళలు అన్ని రంగాలలోనూ ప్రగతి సాధిస్తున్నారుజనసేన పార్టీ ఇన్ చార్జ్ మర్రెడ్డి

గొల్లప్రోలు మార్చి 8 మన న్యూస్ : – మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా ప్రగతి సాధిస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గొల్లప్రోలు లోని మెప్మా కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి మర్రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని రంగాలలో పురుషుల కంటే మహిళలే ముందంజలో ఉన్నారన్నారు. మహిళలు తమ అభిరుచికి అనుగుణంగా అభివృద్ధి సాధించేందుకు కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని 16 మహిళా సంఘాలకు2 రెండు కోట్ల 75 లక్షల రూపాయల విలువైన చెక్కును ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారిణి భారతి, నగర పంచాయతీ మాజీ చైర్ పర్సన్ శీరం మాణిక్యం, మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు, కౌన్సిలర్లు మైనం భవాని, గుళ్ల సుబ్బారావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షురాలు వినకొండ అమ్మాజీ పలు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. స్వచ్ఛ గొల్లప్రోలు ఆధ్వర్యంలో..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్వచ్ఛ గొల్లప్రోలు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ నగర్ లోని స్వామి వివేకానంద జ్ఞాన మందిరంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ అశ్వనీ తేజను ఘనంగా సత్కరించి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలు బహిరంగంలోనూ ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్వచ్చ గొల్లప్రోలు కన్వీనర్ కొసిరెడ్డి రాజా, ప్రముఖ యోగా గురువు జ్యోతుల నాగేశ్వరరావు, స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు కొమ్ము సత్యనారాయణ, చోడ పునీడి పుల్లపురాజు, దాడి పద్మనాభం,గుదే నాగు, మలిరెడ్డి నారాయణరావు, పెదిరెడ్ల వెంకటరాజు, భారతాల శేషారావు, కంకటాల వాసు, మలిరెడ్డి సత్యనారాయణ, వేమనబంది కృష్ణంరాజు, మైనం రాజశేఖర్, పెద్ది శెట్టి మహేష్, కీర్తి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///