ఐసీసీ ఫైనల్స్.. సెంచరీ బాదిన ఏకైక భారత బ్యాటర్‌

Mana News :- ఇంటర్నెట్ డెస్క్: అంచనాలకు తగ్గట్టుగా ఈ సారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) హోరాహోరీగా సాగుతోంది. కొన్ని జట్లు పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు మాత్రం అదరగొడుతున్నారు. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఏకంగా 14 సెంచరీలు నమోదయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఒక సీజన్‌లో ఇదే అత్యధికం. విల్ యంగ్, టామ్ లేథమ్, తౌహిద్ హృదోయ్‌, శుభ్‌మన్ గిల్, రికెల్‌టన్, బెన్ డకెట్, జోష్ ఇంగ్లిస్, విరాట్ కోహ్లీ, రచిన్ రవీంద్ర, ఇబ్రహీం జద్రాన్, జో రూట్, కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్ సెంచరీలు బాదారు. న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర రెండు శతకాలు సాధించాడు. ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లోనూ శతకాలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌ సెంచరీ చేసే ఛాన్స్‌ ఉంది. న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర మరోసారి శతక్కొట్టే అవకాశాలున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో టీమ్ఇండియా తరఫున ఒక్కడే సెంచరీ బాదాడు. ఆ ఒకే ఒక్కడు ఎవరంటే మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly). భారత్ తరఫున దాదా మినహా ఎవరూ ఐసీసీ టోర్నీల్లో మూడంకెల స్కోరు అందుకోలేదు. దాదా ఎప్పుడు చేశాడంటే? 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నైరోబీ వేదికగా జరిగింది. ఈ టైటిల్ పోరులో భారత్ చివరి వరకు పోరాడి ఓడింది. కెప్టెన్ సౌరభ్ గంగూలీ (117; 130 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకం బాదాడు. ఐసీసీ టోర్నీల్లో భారత్‌ తరఫున నమోదైన ఏకైక సెంచరీ ఇదే. ఆ మ్యాచ్‌లో సచిన్ (69) కూడా రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. క్రిస్ కెయిర్న్స్ (102) శతకానికితోడు క్రిస్ హారిస్ (46), నాథన్ ఆస్లే (37) పరుగులు చేయడంతో కివీస్‌ రెండు బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఆ అవార్డూ ఒక్కడికే :- భారత్ ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీ ఐదుసార్లు ఫైనల్‌కు చేరింది. 2002లో భారత్, శ్రీలంక సంయుక్త విజేతలుగా నిలవగా.. 2013లో ఇంగ్లాండ్‌ను ఓడించి టీమ్ఇండియా ఛాంపియన్‌గా అవతరించింది. ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో భారత్ తరఫున అత్యధిక స్కోర్లు చేసిన బ్యాటర్లు :-వీరేంద్ర సెహ్వాగ్ – 82; 81 బంతుల్లో (ఆస్ట్రేలియాపై, 2003 వన్డే ప్రపంచ కప్ ఫైనల్), సౌరభ్ గంగూలీ – 117; 130 బంతుల్లో (న్యూజిలాండ్‌పై, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2000 ఫైనల్) ,గౌతమ్ గంభీర్ – 97; 122 బంతుల్లో (శ్రీలంకపై, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్) ,మహేంద్ర సింగ్ ధోనీ – 91*; 79 బంతుల్లో (శ్రీలంకపై, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌) ,అజింక్య రహానె – 89; 129 బంతుల్లో (ఆస్ట్రేలియాపై, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్, తొలి ఇన్నింగ్స్‌లో)

Related Posts

ఎంతకు తెగించార్రా.. నమ్మితే ఇంత మోసం చేస్తారా!?

Mana News :- Virat Kohli VS Shreyas Iyer: ఆర్సీబీని దాని సొంతగడ్డపైనే ఓడించాక పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ కాస్త గట్టిగానే సంబరాలు చేసుకున్నాడు. మరి అది చూసిన విరాట్ కోహ్లీ ఊరుకుంటాడా? దానికి గట్టిగానే ప్రతీకారం తీర్చుకున్నాడు. ఏప్రిల్ 20న…

గుజరాత్ vs కోల్‌కతా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

Mana News :- పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో (PBKS vs KKR) కేవలం 112 పరుగులను ఛేదించలేక బోల్తా పడి ఐపీఎల్ చరిత్రలోనే ఘోర ఓటమిని మూటగట్టుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ రోజు (ఏప్రిల్ 21)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

  • By JALAIAH
  • April 24, 2025
  • 3 views
జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్