వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీపర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ ను ఘనంగా సత్కరించారు.అనంతరం ఆయా రంగాల్లో రానిస్తున్న మహిళలను సత్కరించి.వారికి నేతలు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళల పాత్ర ఎనలేనిదని కొనియాడారు.నేడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రానిస్తుండడం అభినందనీయమని తెలిపారు.ఒకప్పుడు మహిళ ఏ రంగంలో రాణించాలన్న పురుషుడు పాత్ర కొంత అవసరం ఉండేదని నేడు అలా కాకుండా మహిళలే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ విజయాలను సొంతం చేసుకుంటూ తమకు తిరుగు లేదని చాటుకుంటున్నారని తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల ఆకాంక్షలకు అనుగుణంగా వారి నిర్ణయాలను గౌరవిస్తూ మహిళలను ప్రగతి పథంలో నిలిపే పార్టీ అని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా అందుకు అనుగుణంగా మహిళలకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్న తక్షణమే పరిష్కరించాలన్న దృక్పథం కలవారని తెలిపారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక పథకాలు తీసుకువచ్చారన్నారు,అందులో భాగంగా ఆసరా,చేయూత,కాపు నేస్తం వంటి పథకాలతో మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు.రాబోయే రోజుల్లో కూడా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మహిళా పక్షపాతి ప్రభుత్వాన్ని సాదించుకోవాలని పిలుపునిచ్చారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..