

రోజు రోజు కి 39 డిగ్రీల నుండి 40డిగ్రీల ఎండ విస్తున్నది కావున ప్రజలు అప్రమత్తం గా ఉండాలి
మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గట్టు మండలంలో పర్యటిస్తున్న గద్వాల్ సారధి ప్రభుత్వ కళాకారుల అవగాహనా కార్యక్రమలు రోజు రోజుకు ఎండలు మండుతున్నాయి ప్రజలు జాగ్రత్త గా ఉండాలని తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ కుమార్ సారథ్యంలో DPRO ఆరిఫ్ ఉద్దిన్ అధ్యర్యంలో శుక్రవారం నాడు గట్టు మండలం ఆరగిద్ద గ్రామానికి తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల అధ్యక్షులు మొహమ్మద్ రాహుల్ నేతృత్వంలో ఆరగిద్ద గ్రామం లో ఎండ తీవ్రత లో జాగ్రత్తలు పాటించాలని వడదెబ్బ బారిన పడకుండా మనల్ని మనమే రక్షించుకోవాలని ప్రజలకు ఆట పాటలతో వివరించడం జరిగింది. ఆహ్లాదకరమైన గాలి కొరకు చెట్ల కింద ఉండవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమం లో ప్రజలు అధికారులు మరియు కళాకారులు రేలారే ప్రసాద్. కేశవులు. రమాదేవి. భూపతి. కవిత. హజరత్. స్వామి. కృష్ణ పాల్గొన్నారు
