పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం నగర పంచాయితీ పరిధిలో మరియు ఏలేశ్వరం మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా శంకుస్థాపన చేశారు. ఏలేశ్వరం నగర పంచాయితీలో నాలుగు కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాలలో చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగర పంచాయతీ పరిధిలో మురుగు కాలవల్లో పేరుకుపోయిన చెత్తను, మురుగును తొలగించే కార్యక్రమం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.నగర పంచాయతీ పరిధిలో సిసి రోడ్ల నిర్మాణం కోసం మరియు నగర పంచాయతీ ప్రధాన రహదారిలో ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్య ప్రభ మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్ఆర్సిపి పాలనలో ఐదేళ్లుగా నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోక అన్ని రంగాలలో వెనకబడిపోయిందని అన్నారు.ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతుంది అన్నారు. అభివృద్ధి ,సంక్షేమం సమాంతరంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. నియోజకవర్గంలో సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి,నిధులు తీసుకురావడం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నానని ఆమె అన్నారు.నియోజవర్గ సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారు సానుకూలంగా స్పందించి, వెంటనే సమస్య పరిష్కారానికి సహకరిస్తున్నారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జి వరుపుల తమ్మయ్య బాబు,నగర పంచాయితీ చైర్మన్ అలమండ సత్యవతి,కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి,మూది నారాయణస్వామి,కూటమి నాయకులు పెంటకోట మోహన్,బస్సా మహాలక్ష్మి ప్రసాద్, మైరాల కనకారావు మరియు ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!