నిన్నేమో రోహిత్ శర్మపై.. ఇప్పుడు కోహ్లీపై కూడా.. షామా మహ్మద్ కాంట్రవర్సీ కామెంట్స్!!

Mana News, Sports :- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసి కొత్త వివాదం లేవనెత్తిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ ప్రస్తుతం తీవ్రంగా విమర్శలకు గురౌతుంది.సామాన్య క్రికెట్ అభిమానుల నుంచి రాజకీయ, క్రీడా ప్రముఖుల వరకు అందరూ ఆమెపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో షామా గతంలో విరాట్ కోహ్లీపై కూడా చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆమెపై క్రికెట్ అభిమానులు మరింత రెచ్చిపోతున్నారు. అభిమానిపై కోహ్లీ ఫైర్..:- 2018లో కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో ఓ అభిమాని.. భారత క్రికెట్ ను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో పోలుస్తూ కామెంట్స్ చేశాడు. “నేను టీమిండియా కన్నా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆడే క్రికెట్ ను బాగా ఆస్వాదిస్తాను. కోహ్లీని అనవసరంగా పెద్ద బ్యాటర్ గా అభిమానిస్తుంటారు” అని అన్నాడు. దానికి కోహ్లీ.. “నువ్వు భారత్ లో నివసించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. భారత్ కాకుండా ఇంకెక్కడికైనా వెళ్లి జీవించు. ఎందుకు ఇక్కడ ఉంటున్నావ్. భారత్‌లో ఉంటూ ఇతర దేశాలపై అభిమానం చూపించడం ఏంటి. నీకు నేను నచ్చకపోవడంపై నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు.” అంటూ కోహ్లీ రిప్లై ఇచ్చాడు. కోహ్లీ పోస్ట్ పై షామా ఘాటు స్పందన :- అయితే ఆ సమయంలో కోహ్లీ పెట్టిన రిప్లైపై షామా ఘాటుగా స్పందించింది. “బ్రిటిషర్లు కనిపెట్టిన గేమ్ ను కోహ్లీ ఆడతాడు. ఫారెన్ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నాడు. పెళ్లి కూడా ఇటలీలోనే చేసుకున్నాడు. హెర్షెల్లె గిబ్స్ తన ఫేవరెట్ క్రికెటర్ అని, ఏంజెలిక్ కెర్బర్ తన ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్ అని అంటుంటాడు. కానీ ప్రజలను ఇతర దేశాల ప్లేయర్లను అభిమినుస్తున్నామని చెబితే మాత్రం, వారిని దేశాన్ని విడిచిపెట్టాలని అంటాడు” అని షామా… కోహ్లీ పోస్ట్ పై బదులిచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందింస్తూ.. షామాకు ఇండియన్ ప్లేయర్స్ ఎవరూ నచ్చరేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

Related Posts

రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, 15 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన మణికొండ మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్ మన న్యూస్ ;- తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిజెఆర్ జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, అండర్ 15 టోర్నమెంట్ లో మణికొండ మ్యాచ్ పాయింట్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తమ సత్తా…

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

మూడవ రోజు రాత్రి వాహన సేవ

మూడవ రోజు రాత్రి  వాహన సేవ

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర