

తవణంపల్లి మార్చి 3 మన న్యూస్
తవణంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా టి. జగన్నాథం, ప్రధాన కార్యదర్శిగా అనంత కుమార్, ఉపాధ్యక్షులుగా సిద్దయ్య , కోశాధికారిగా జీవన్ కుమార్ రెడ్డి , ఉప కార్యదర్శిగా రామ కుమార్ ,రాజశేఖర్ ,కార్యవర్గ సభ్యులుగా షణ్ముగం గజేంద్ర రాజా, మహేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తవణంపల్లిలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ సభ్యులు అధికారులకు ప్రజలకు వారధిగా నిలిచి పేదలకు న్యాయం చేయాలని పలువురు కోరారు.