ఏపీ, తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా, 10 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

Mana News:-  ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అదే సమయంలో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసారి ఎమ్మెల్యే కోటా ఎన్నికల నోటిఫికేషన్. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో యనమల రామకృష్ణుడు, జంకా కృష్ణమూర్తి, బీటీ నాయుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావుల పదవీకాలం మార్చ్ నెలాఖరుతో పూర్తవుతోంది. వీటిలో జనసేన తరపున నాగబాబుకు, బీజేపీకు ఒకటి కేటాయించనున్నారు. మిగిలిన మూడు స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్ధులు బరిలో దిగుతారు. టీటీపీ నుంచి ముగ్గురిలో యనమల రామకృష్ణుడికి మరో అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మిగిలిన రెండు స్థానాల కోసం పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. ఇక తెలంగాణలో శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, మీర్జా హసన్ పదవీకాలం ముగియనుంది. ఇలా మొత్తం 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చ్ 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు ఉంటాయి. పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తేదీలు :- మార్చ్ 3 ఎన్నికల నోటిఫికేషన్ , మార్చ్ 10 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ, మార్చ్ 11 నామినేషన్ల పరిశీలన , మార్చ్ 13 నామినేషన్ల ఉపసంహరణ గడువు ,మార్చ్ 20 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ,మార్చ్ 20 సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ .

Related Posts

వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు.*వెల్లడించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి .*ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేత.వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించేలా…

కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

మన న్యూస్ , కావలి: నెల్లూరు జిల్లా కావలి ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారుఆదివారం పాతూరు నుంచి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో కూటమినేతల ఆత్మీయ సమావేశానికి చేరుకుని తన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

మూడవ రోజు రాత్రి వాహన సేవ

మూడవ రోజు రాత్రి  వాహన సేవ

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర