మాజీ ఐఏఎస్‌ వ్యాఖ్యలు అత్యుత్సాహం అనిపించాయి-సందీప్‌ రెడ్డి

Mana News :- దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ‘యానిమల్‌’ చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆయన చిత్రంలో ఉన్న హింసాత్మక దృశ్యాలు, భావోద్వేగపూరిత సన్నివేశాలు చర్చనీయాంశమయ్యాయి.ఇప్పుడు ఆయన ‘యానిమల్‌ పార్క్‌’ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇటీవల ఓ పాడ్‌క్యాస్ట్‌లో పాల్గొన్న సందీప్‌ తన అనుభవాలను పంచుకున్నారు.’యానిమల్‌’పై వచ్చిన విమర్శల గురించి సందీప్‌ స్పందిస్తూ..’గతంలో ఓ మాజీ ఐఏఎస్‌ అధికారి ఓ ఇంటర్వ్యూలో ‘యానిమల్‌’ లాంటి సినిమాలు తీయకూడదు. ఆ సినిమా సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లింది అని అన్నారు. నిజంగా ఆయన అలా అనడం నన్ను ఎంతో బాధించింది. ఆయన మాట్లాడిన తీరు చూస్తే, నేను ఏదో పెద్ద నేరం చేసినట్లుగా అనిపించింది. నా సినిమా గురించి ఆయన చేసిన విమర్శలు నాకు అనవసరంగా, అత్యుత్సాహంగా అనిపించాయి’ అని చెప్పుకొచ్చారు.ఇక అలాంటి మాటలు విని తనకు చాలా కోపం వచ్చిందన్న సందీప్‌.. కానీ ఆ తర్వాత తాను ఒక విషయాన్ని గమనించానన్నారు. ఐఏఎస్‌ కావాలంటే దిల్లీకి వెళ్లి కోచింగ్‌ తీసుకుని రెండేళ్లు, మూడేళ్లు కష్టపడితే సాధించవచ్చు. అందుకోసం ప్రత్యేకమైన పుస్తకాలు, మార్గదర్శకులు ఉంటారు. కానీ ఓ ఫిల్మ్‌మేకర్‌ కావాలంటే? ఓ రచయితగా ఎదగాలంటే? దీని కోసం ఎక్కడైనా కోచింగ్‌ సెంటర్లు లేదా పక్కనే ఓ టీచర్‌ ఉంటారా? అసలు ఇది నేర్చుకోవడానికి ఎలాంటి సిస్టమ్‌ లేదు. పూర్తిగా మన స్వయంకృషిపై ఆధారపడి ఉండాలి. రచనకు, కథనానికి, దర్శకుడిగా అభివృద్ధి చెందడానికి ఒక్కో వ్యక్తి స్వంతంగా ప్రయాణం చేయాలి. అందుకే, నన్ను నేను నమ్ముకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా” అని పేర్కొన్నారు.కాగా సందీప్‌ ప్రస్తుతం యానిమల్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న యానిమల్‌ పార్క్‌తో పాటు ప్రభాస్‌ హీరోగా స్పిరీట్‌ మూవీకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!