

మనన్యూస్,ఎల్ బి నగర్:కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్,మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.ఫాక్స్ కాన్ కంపెనీ లో ఉద్యోగాల కల్పనలో భాగంగా మధుయాష్కి గౌడ్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను శనివారం హస్తినాపురం లోని ఏఎంఆర్ కన్వెన్షన్ హల్ లో నిర్వహించారు. మహిళలు,యువతులు పెద్ద సంఖ్యలో జాబ్ మేళాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన పలువురికి నియామక పత్రాలను మధుయాష్కీ అందజేశారు.ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా నిరుద్యోగ సమస్య రూపుమాపే విషయంపై పోరాడుతున్నారన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో దేశ విదేశాల నుంచి కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.యువత ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలన్నారు.ఫాక్స్ కాన్ కంపెనీ వారు నగరానికి 70 కిలోమీటర్ల పరిధిలో ఉచిత బస్సు, ఉచిత భోజనం,ఈ ఎస్ ఐ, పీ ఎఫ్ సదుపాయాలను కల్పిస్తూ, ఉద్యోగాలు ఇస్తున్నారని,యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఎల్.బి.నగర్,మహేహశ్వరం,ఇబ్రహీంపట్నం ప్రాంతాల వాసులు ఉద్యోగాలు పొంది ఆర్ధిక ఉపశమనం పొందవచన్నారు. కాలనీలు బస్తీలలోనూ జాబ్ మేళాలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా సూచించారు. ఫాక్స్ కాన్ కాంపెనీలో 90 శాతం యువతులకు,10 శాతం యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్,కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ నేలపాటి రామారావు,పాశం అశోక్ గౌడ్,బుడ్డా సత్యనారాయణ,టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ ఆంగోతు వెంకటేష్,నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,దాము మహేందర్ యాదవ్,శశిధర్ రెడ్డి,కొండోజు శ్రీనివాస్, విద్యా రెడ్డి, ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులు మణికంఠ, లోకేష్,రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.