సక్రమంగా పనిచేస్తున్నా విధుల నుండి తొలగించారు,,చెందుర్తి వివోఏ ఆవేదన

మనన్యూస్,గొల్లప్రోలు:తాను సక్రమంగా విధులు నిర్వహిస్తూ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా విధుల నుండి తొలగించారని గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన వి ఓఏ యానిమేటర్ చికట్ల కృష్ణకుమారి ఆవేదన వ్యక్తం చేశారు శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2019 సంవత్సరం నుండి తాను విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు.ఇటీవల తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కొద్దిమంది సభ్యులతోనే సమావేశం నిర్వహించి తనను తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.తన స్థానంలో ఎటువంటి విద్యార్హత లేని ఒక మహిళను నియమించారని తెలిపారు.ఆమెకు విద్యార్హత లేదని పదవ తరగతి ఫెయిల్ అయ్యారని,నకిలీ సర్టిఫికెట్ సమర్పించారని మహిళా సంఘాలసభ్యులు తెలియజేసినా ఎ పిఎం సన్యాసిరావు వి ఓఎ గా ఆన్లైన్ చేసి నియమించారని ఆమె వాపోయారు.ఇందుకు సంబంధించి గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ నిర్వహించినట్లు తెలిపారు తగిన విద్యార్హత ఉండి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్న తనను దళిత మహిళ అనే కారణంతో తొలగించారని బోరున విల పించారు.తనను ఆ కారణంగా తొలగించడం పైనా,ఎటువంటి విద్యార్హత లేని వారిని నియమించడం పైనా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అధికారులు న్యాయం చేయవలసిందిగా కృష్ణకుమారి కోరారు.ఆ కారణంగా తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి తమకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న వివో ఏ చీకట్ల కృష్ణకుమారిని అకారణంగా తొలగించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు.ఉద్దేశపూర్వకంగా ఎ పిఎం అర్హత లేనివారిని నియమించారని ఆరోపించారు.వివోఏ గా పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారిని నియమించవలసి ఉండగా పదో తరగతి ఫెయిల్ అయి సరైన సర్టిఫికెట్ లేని మహిళను నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తొలగించిన యానిమేటర్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పిల్లా సూర్యకాంతం,అల్లి కుమారి,దారా ఏసురత్నం,వాసా శాంతి,బొల్లం స్వర్ణలత,బొబ్రాల నాగమణి,దారా పాపారత్నం పిల్ల వేణు నాగమణి తదితరులు డిమాండ్ చేశారు.

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా