

మనన్యూస్,కామారెడ్డి:గత కొన్ని సంవత్సరాలుగా అదే ఇంట్లో ఉంటున్న వృద్ధురాలు అని చూడకుండా ఇంటిలోని సామాగ్రిని తీసి బయట పారవేసిన యజమాని వివరాలకు వెళ్తే కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ కాలనీలో నివాసముంటున్న ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ గా పనిచేసి రిటైర్డ్ ఉద్యోగి తుమ్మగల్ల బాలమణి మీడియాతో మాట్లాడారు 2000 సంవత్సరంలో ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నప్పుడు వల్లకాటీ నర్సయ్య ఇంట్లో అద్దెకు ఉండడం జరిగిందని గత కొన్ని సంవత్సరాల నుండి ఇప్పటివరకు ప్రతినేల అద్దె కట్టడం జరిగిందని తెలిపారు.గత నాలుగు సంవత్సరాల క్రితం పోగుల రవి అనే వ్యక్తి ఇల్లు కొన్నాననిఇంటి సామాగ్రిని ఇంటి బయట పారవేసి ఇంటికి తాళం చేశారని ప్రతినేల అద్దె కట్టడం జరిగిందని తెలిపారు. గత ఐదు నాలుగు సంవత్సరాల క్రితం పోగుల రవి అనే వ్యక్తి ఇల్లు కొన్నానని ఇంటి మొత్తం సామాగ్రిని గత రెండు నెలల క్రితం ఇంటి బయట పడేయడం జరిగిందని ఇట్టి విషయం పైన దోమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది,బిక్కనూరు సిఐ ఇద్దరిని పిలుసుకొని మాట్లాడి ఒప్పంద పత్రం రాయించుకున్నారని నేను ఇల్లు కొంటానని నేను ఉంటున్న ఇంటికి మరమ్మతులు చేసుకోవడం జరిగిందని,మరమ్మత్తుల ఖర్చులు రెండు లక్షల పైగా కావడం జరిగిందని,అట్టి డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండానే నా ఇంటి సామాగ్రి మొత్తాన్ని ఇంటి బయటపడేసి గత 18 రోజులు అవుతుందని వృద్ధురాలు అని చూడకుండా నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇల్లుకు మరమ్మత్తులు చేసిన ఖర్చు డబ్బులు రెండు లక్షల రూపాయలు ఇప్పించగలరని అధికారులను జిల్లా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాను అన్నారు.