స్టెమి ఇంజక్షన్‌తో గంటలో గుండెకు భరోసా

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:స్టెమి ఇంజక్షన్‌తో గుండెపోటుతో ఉన్న వ్యక్తికి ఒక గంటలో ప్రాణాన్ని సంరక్షించే అవకాశం ఉందని, ఈ విషయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం లో హాస్పిటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శైలజ చెప్పారు. సోమవారం ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్టెమీతో గుండెకు భరోసా కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శైలజ మాట్లాడుతూ మొదటి గంటలోపు చాతి నొప్పి, ఎడం భుజం లాగడం, ఆకస్మిక ఆయాసం, గుండెదడ, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో పేషెంట్లు ఆసుపత్రికి రాగానే ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, మొదటి గంటలోనే రూ.45 వేలు విలువైన టినెక్టి ప్లస్‌ ఇంజక్షన్‌ ఉచితంగా ఇవ్వడం ద్వారా ప్రాణాన్ని కాపాడవచ్చునని అన్నారు. అటువంటి సమస్యలు ఉన్నవారు ఆసుపత్రికి రాగానే ఇసిజి తీసి కాకినాడలో ఉన్న జిజిహెచ్‌ హబ్‌ వెంటనే రిపోర్టులు మెయిల్‌ ద్వారా పంపించి, వారి సూచనలు తీసుకుని వెనువెంటనే టినెక్టి ప్లస్‌ ఇంజక్షన్‌ పేషెంట్‌కు అందించడం ద్వారా గంటలోగా ప్రాణాలు రక్షించడం జరుగుతుందన్నారు. ఈ వైద్య విధానంపై ఆసుపత్రి పరిధిలో గల ప్రజలకు విరివిగా ప్రచారం నిర్వహించి గుండె జబ్బు నుంచి సంరక్షించుకునేలా చూడాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ డాక్టర్ ఎన్ రాఘుపతి,డాక్టర్ కె లావణ్య, డాక్టర్ సిహెచ్. డి స్రవంతి, డాక్టర్ వి.రమేష్, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు
పాల్గొన్నారు. స్టెమి ఇంజక్షన్‌ గుండెకు భరోసా అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు