చిత్తూరు జిల్లాకే ఆదర్శంగా నిలిచిన పుత్రమద్ది గ్రామ రైతాంగం…

ఐరాల మన న్యూస్ జనవరి-31

చిత్తూరు జిల్లా ఐరాల మండలం పుత్రమద్ది గ్రామానికి తాగునీటి, సాగునీటి అవసరాల నిమిత్తం పూర్వీకులు రెండు చెరువులను నిర్మించారు. ఈ రెండు చెరువులు నిండి ఐదు సంవత్సరాలు అవుతుంది. వర్షాలు సక్రమంగా పడకపోవడం, సప్లై చానెల్స్ పూడిపోవడంతో చెరువులు నిండడం గగనంగా మారింది. చెరువులో నిండకపోవడంతో చెరువుల కింద పంటలు పండడం కష్టంగా మారింది. భూగర్భ జలాలు అడుగంటడంతో వెయ్యి అడుగులు బోర్లు వేసినా నీళ్లు పడక ఎందరో రైతులు నష్టపోయారు. ఈ సమస్యను పరిష్కరించుకోవాలని గ్రామస్తులు నిర్ణయించారు. గ్రామస్తులు ఒకచోట సమావేశమై తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగితే ఉపయోగము ఉండదని భావించారు. 20 సంవత్సరాల కిందట తవణంపల్లి మండలం, పట్రపల్లి సమీపంలో నుండి మేడిపంక సప్లై ఛానల్‌ను ప్రభుత్వం నిర్మించింది. ఈ సప్లై ఛానల్‌ను నిర్మించిన ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం అందజేయడాన్ని విస్మరించింది.
నష్టపరిహారం కోసం రైతులు పట్టుపట్టడంతో ఈ ఛానల్ నిర్వహణలో ఇరిగేషన్ అధికారులు గాలికి వదిలేశారు. కాల్వ పూడిపోయి, అక్కడి నుంచి చెరువులకు నీళ్లు రావడం ఆగిపోయింది. చాలా చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఏపుగా ముళ్ళ పొదలు పెరిగాయి. వీటిని తొలగించి సప్లై ఛానల్‌లో పూడిక తీయాలని, బహుదా నది నీటిని తీసుకురావాలని గ్రామస్తులు నిర్ణయించారు. పుత్రమద్ది గ్రామస్తులకు తోడు బలిజపల్లి, మిట్టూరు, గురవనంపల్లి, వెంగంపల్లి రైతాంగం కూడా కలిసింది. తవణంపల్లి మండలంలోని బహుదా నది నుంచి మేడి వంక సప్లై ఛానల్‌లో పూడిక తీయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నిధులను చందాల రూపంలో స్వచ్ఛందంగా పోగు చేసుకోవాలని నిర్ణయించారు. గతంలో చెరువుల్లోని చేపల అమ్మకం ద్వారా వచ్చిన కొంత మొత్తం నిధులు ఉన్నాయి. వాటికీ తోడు గ్రామాల్లోని మేటి రైతులు కొంత పెద్ద మొత్తాలలో చందాలను అందజేశారు. కాలువలో పూడిక తీయడం కార్యక్రమం ప్రారంభమైంది.
సుమారు రెండు నెలల పాటు హిటాచీలను ఉపయోగించారు. ముళ్ళ పొదలు తొలగిస్తూ, పూడిక తీస్తూ తొమ్మిది కిలోమీటర్లు సప్లై ఛానల్‌ను సిద్ధం చేశారు. మధ్యలో మూడు కల్వర్టులను నిర్మించారు. పుత్రమద్ది గ్రామంలోని రైతులందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ పనులను ముందుండి పర్యవేక్షించారు. యువకులు దగ్గరుండి పనులు చేయించారు. ఎట్టకేలకు సప్లై ఛానల్ పునరుద్ధరించారు. సరకల్లు వద్ద బహుదా నది నీటిని మేడివంక సప్లై ఛానల్‌కు మళ్లించారు. మళ్లించిన నీటిని ఇతర గ్రామస్తులు వారి గ్రామాలకు మళ్లించకుండా జట్లు జట్లుగా గ్రామస్తులు కాపు కాశారు. దీంతో ఉప్పొంక చెరువు, కొత్తచెరువు, మద్దిమాను చెరువు, వెంగంపల్లిలోని ఎగువ, దిగువ చెరువులు, గురవణంపల్లిలోని జింకలవాని చెరువు నిండుకుంటూ పుత్రమద్ది గ్రామానికి ఈ నీళ్లు చేరాయి. పుత్రమద్ది గ్రామంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వీర రాఘవుల చెరువు నిండి మరవ పోయింది. ఆ నీళ్ళు మరో 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కారియన్ రెడ్డి చెరువుకు చేరాయి. వారం రోజుల్లో ఈ చెరువు కూడా నిండి మొరవ పోయింది.
దీంతో పుత్రమద్ది గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. చెరువుల వద్ద మేకపోతులను బలి ఇచ్చి పండుగ చేసుకున్నారు. గంగమ్మతల్లికి పూజలు చేశారు. ఊరంతా సంబరాలు చేసుకున్నారు. ఐదు సంవత్సరాలు తర్వాత ఈ చెరువులు నిండడంతో క్రమంగా భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. గ్రామంలో తాగునీటి సమస్య కూడా తీరింది. ప్రతిరోజు ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పుత్రమద్ది చెరువులు నిండిన తర్వాత బలిజపల్లెలోని చిన్న రాముని చెరువు, కామినాయుని పల్లి చెరువులు నింపుతున్నారు. ఇలా పుత్రమద్ది లోని ఆదర్శ రైతులు జిల్లాలోని రైతాంగానికి మకుటాయమానంగా నిలిచారు. తమ సమస్యను తామే పరిష్కరించుకొని సహబాష్ అనిపించుకున్నారు. పుత్రమద్ది గ్రామస్తుల స్పూర్తితో మరిన్ని గ్రామాల రైతులు ముందుకు రావాలని ఆశిద్దాం.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు