నాగమడుగులో పుణ్య స్నానాలు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ , నాగమడుగులో పుణ్య స్నానాలు తీరం భక్తజన సంద్రంగా మారింది. బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకొని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ శివారులో గల నాగమడుగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల పుణ్యస్నాలతో నాగమడుగు భక్తులతో కిటకిటలాడాయి. మౌని అమావాస్య అనగా సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం. పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి అమృతంగా మారి కిందికి వస్తుందని భక్తులు నమ్ముతారు. దీంతో ప్రవహించే నీటితో స్నానం ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా నది ఒడ్డున గల శివలింగానికి రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. దీని పక్కన గల నాగ స్వరూపానికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎవరికైనా కాల సర్ప దోషాలు ఉన్నట్లయితే స్నానం ఆచరించి ఈ పూజలు నిర్వహించుకుంటారు. దీని ద్వారా ఉద్యోగాలు, సంతానం, వివాహముకు ఆటంకాలు ఉన్న తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ యొక్క పుణ్యస్నానాలకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు. పురోహితులు పూజలు నిర్వహిస్తారు. ఈ నీటిలో ఔషధ తత్వాలు ఉంటాయని దాని ద్వారా చర్మ రోగులు గాని ఇంకా ఏదైనా వ్యాధులు ఉన్న తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ కార్యక్రమాన్ని అచ్చంపేట గ్రామస్తులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అందరూ ఈ భోజనాన్ని మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే. మల్లికార్జున్, బంగ్లా ప్రవీణ్ కుమార్, బొడ్డు అంజయ్య, చాకలి రమేష్, సురేష్ గౌడ్, లంబాడి కిషన్,సాయిబాబా, మంగలి ఎల్లయ్య ,పిట్ల సత్యనారాయణ, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///