

మనన్యూస్,కామారెడ్డి:బోదాసు నర్సింలు,కేశయ్య,లింగన్నపేట్,మండలం గంభీరావుపేట్,రాజన్న సిరిసిల్ల జిల్లా,పిఎస్ మాచారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసినా విషయం ఏమనగా తన కొడుకు అయిన బోదాసు యెల్లంపేట్ గ్రామము,మాచారెడ్డి మండలంనకు చెందిన బోదాసు నందిని మమత తో 5సం.రాల క్రితం వివాహం గత 5 నెలల క్రితం తన కోడలు తన కొడుకు తో గొడవపడి కోడలు యొక్క తల్లి గారింటికి వెళ్ళిపోయింది.అల్లుడు బోదాసు స్వామి తన కూతుఋ నందిని ని వదిలెసాడని కోపంతో మామ ఎల్లయ్య,అతని పెద్దల్లుడు పెనుగొండ సాయిలు,అతని కొడుకు తిరుపతి,అతని కూతురు నందిని మరియు అతని తమ్ముడి కొడుకు నితిన్ లు కలిసి వారు ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం తేదీ 21.01.2025 నాడు మద్యాన్నం 2-00 గంటల సమయంలో Chai Duniya హోటల్ సమీపములో బోదాసు స్వామి మరియు అతని తండ్రి కలిసి బైక్ పై వెళ్తుండగా వారిని అడ్డుకుని.బూతు మాటలు తిడుతూ,నర్సయ్యను ను చేతులతో కొట్టి కింద త్రోసేసి స్వామిని వారు ముందుగానే తెచ్చుకున్న కర్రలతో కొట్టి వారి యొక్క కారు నెంబర్ TS-17-G-6665 గల దానిలో ఎక్కించుకొని ఎల్లంపేట్ తీసుకెళ్లి చంపాలనే ఉద్దేశ్యంతో తీవ్రంగా కొట్టగా అతను గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఇట్టి కేసులో S.P.కామారెడ్డి గారి ఉత్తర్వుల మేరకు A.S.P.కామారెడ్డి గారు టీమ్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతంగా చేసి పరారీలో ఉన్న అయిదుగురు నిందితులను పట్టుకొని(A1)కుంచం ఎల్లయ్య,(A2)పెనుగొండ సాయిలు,(A3)కుంచం తిరుపతి,(A4)బోదాసు నందిని @కుంచం మమత,(A5)కుంచం నితిన్ లు వారు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు.అట్టి అయిదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 6 మొబైల్ ఫోన్ లు,మూడు బైకులు,ఒక కారు,ఒక బంగారు ఉంగరం మరియు ఒక పర్సు స్వాధీనపర్చుకొనైనది.ఇట్టి కేసు దర్యాప్తులో పాల్గొని మర్డర్ కేసుని చేదించిన కామారెడ్డి రూరల్ సీ.ఐ.S.రామన్,మాచారెడ్డి ఎస్సై S.అనిల్,PC’s సిద్దిరాములు,శ్రీకాంత్,గంగాధర్,నర్సింలు మరియు పిఎస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ మరియు కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీసు అధికారి చైతన్య రెడ్డి అభినందించడం జరిగింది.