సంక్రాంతికి ఊరెళ్తున్నారా. జరభద్రం అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

మన న్యూస్,సరూర్ నగర్: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు.ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు.ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని,ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ పోలీస్ ఆదేశాల మేరకు సరూర్నగర్ పోలీసులు తెలిపారు సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.ఈ విషయంలో రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు.
సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు.
దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్‌ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారులకు తెలపాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు చెప్పడం మంచిది ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి.విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదు.ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు.బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి.ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్‌ కర్టెన్‌ వేయాలి.గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి, వాటిని కూడా గమనించి నేరస్తులు దొంగతనాలకు పాల్పడుతారు అన్న విషయాన్ని గమనించండి.విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు.ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. లేదా ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి.మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు చూసుకొంటూ వుండాలి. మీ ఇంటికి వచ్చే, వెళ్ళే దారులు ఇంటిలోపల సీసీ కెమెరాలు అమర్చు కొని డివిఆర్ కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశం లో పెట్టుకోండి.హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మీ మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా లైవ్/ప్రత్యక్షంగా చూసుకునే వీలుంది. హోమ్ సెక్యూరిటీ సర్వెలెన్స్ కు ఇవి ఎంతో ఉపయుక్తం.సొంత ఇల్లు అయినట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి గ్రిల్స్ అమర్చుకోవడం ద్వారా రెండంచెల భద్రతనిస్తుంది.ఇంట్లో.సాధారణంగా సరైన భద్రతా ప్రమాణాలు పాటించని ఇండ్లు, చీకటి ప్రదేశం, పాత గ్రిల్స్‌ ఉన్న ఇండ్లలో దొంగలు పడే అవకశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలి. పోలీసు స్టేషన్‌ నెంబర్, వీధుల్లో వచ్చే బీట్‌ కానిస్టేబుల్‌ నెంబర్‌ దగ్గర పెట్టుకోవాలి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు పక్కల వారికి లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలి.కాలనీవాళ్లు కమిటీలు వేసుకొని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకకోవాలి.కాలనీ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్‌ లేదా రాచకొండ పోలీస్ కంట్రోల్ రూమ్ 8712662666
సరూర్ నగర్ పోలీసు వాట్సాప్‌ నెంబర్‌ 8712662355 కు సమాచారం ఇవ్వండని సీఐ సైది రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సైలు మారయ్య, మహేందర్, లక్ష్మణ్ ,శ్రవణ్, గంగాధర్ రెడ్డి కిషన్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు

  • Related Posts

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మూడవ రోజు రాత్రి  వాహన సేవ

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర