జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో చైనా మంజా నిషేదం

మన న్యూస్,గద్వాల జిల్లా: నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయించిన,వినియోగించిన చట్టపరమైన చర్యలు జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు,ఐపిఎస్. జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో చైనా మాంజ పై నిషేధం విధించడం జరిగిందని, జిల్లా లో ఎవరైనా చైనా మంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ ఒక ప్రకటనతో తెలిపారు.
రాబోయే సంక్రాంతి పండగ సంద‌ర్భంగా చైనా మాంజ ఎక్కువ‌గా విక్ర‌యించే దుకాణాల పై అధికారులు తనిఖీ లు నిర్వహించడం జరుగుతుందని, నైలాన్, సింథటిక్‌ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలతో పర్యవరణానికి విపత్తుగా మారడం తో పాటు చైనా మాంజ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని , చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. చైనా మాంజ‌ను ఉప‌యోగించి గాలి ప‌టాలు ఎగుర‌వేసే క్రమంలో ఎన్నో ప‌క్షులు, సాధారణ ప్రజలు కూడా ప్ర‌మాదానికి గురవుతారు. అదే క్ర‌మంలో గాలిప‌టాలు ఎగుర‌వేసే వ్య‌క్తులు కూడ ప్ర‌మాదానికి గురైన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో చైనా మంజా నిషేదించాం అని ఎస్పి తెలిపారు. చైనా మాంజాపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా కూడా వుంటుంది అని తెలిపారు. జిల్లా పరిధిలో అన్ని ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయాలు జరగకుండా తగు చర్యలు తీసుకొవడం జరుగుతొందని ప్రధానంగా ప్రజలు సైతం చైనా మాంజా వినియోగించకుండా ఎవరికి హాని కలగని సాధారణ దారంతో గాలిపటాలను ఎగురవేసుకోవాలని, అలాగే ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్న, వినియోగిస్తున్న డయల్‌ 100 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలనీ జిల్లా ఎస్పీ గారు ప్రజలకు సూచించారు.

  • Related Posts

    సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

    మన ధ్యాస, నిజాంసాగర్, (జుక్కల్) ప్రజల సౌకర్యార్థం కోసం 15వ ఆర్థిక సంఘం నిధులతో కలిపి ఎస్ బిఎం కింద 5 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపడుతున్నామని. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు.పెద్ద కోడప్ గల్…

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి….//

    • By NAGARAJU
    • September 15, 2025
    • 5 views
    మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి….//

    ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు కావలి ఆర్టీవో మురళీధర్…

    • By NAGARAJU
    • September 15, 2025
    • 3 views
    ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు కావలి ఆర్టీవో మురళీధర్…

    నేటి నుంచి ఆంధ్ర హైకోర్టు సాధన,సమితి కోసంఆందోళన

    నేటి నుంచి ఆంధ్ర హైకోర్టు సాధన,సమితి కోసంఆందోళన

    సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

    • By RAHEEM
    • September 15, 2025
    • 3 views
    సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

    జలదంకి లో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీవర్ధన్ భౌతికకయానికి నివాళులు అర్పించిన కొట్టే వెంకటేశ్వర్లు….

    • By NAGARAJU
    • September 15, 2025
    • 7 views
    జలదంకి లో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీవర్ధన్ భౌతికకయానికి నివాళులు అర్పించిన కొట్టే వెంకటేశ్వర్లు….

    ముస్లిం సోదరుడు యాకుబ్ భాషా వివాహ వేడుకలకు హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    • By NAGARAJU
    • September 15, 2025
    • 5 views
    ముస్లిం సోదరుడు యాకుబ్ భాషా వివాహ వేడుకలకు హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!